టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, అనుష్క శెట్టి హిరోయిన్గా, మాటలు మంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఖలేజా మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. 2010లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించిన రేంజ్ లో ఆడియన్స్ను ఆకట్టుకోలేక ఫ్లాప్గా నిలిచింది. అయితే.. తాజాగా ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణ.. బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే సినిమా ధియేటర్లలో సందడి చేస్తూ కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తుంది.
ఓపెనింగ్ బుకింగ్స్ తోనే మొదటి రోజు రూ.8 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. అనకాపల్లి టూ అమెరికా.. ఖలేజా ఊచకోల వేరే లెవెల్ లో ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మహేష్ కి అసలు స్ట్రాంగ్ జాన్ అయినప్పటికీ.. ఓవర్సీస్ మార్కెట్లో లెక్కలు ఊహించని నెంబర్తో ప్రారంభమయ్యాయి. యుఎస్ లో ఏకంగా 80 వేల డాలర్లకు పైగా వసూళ్లు సాధించి ఖలేజా రీ రిలీజ్ లో రికార్డు క్రియేట్ చేసింది.
15 ఏళ్ల ఫ్లాప్ మూవీ అయినప్పటికీ.. అస్సలు తగ్గేదేలే అంటూ సంచలనాలతో దూసుకుపోతుంది. రీ రిలీజ్ లో ఈ రేంజ్ వసూళ్లు సాధించి ఖలేజా.. ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిందంటూ యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు. మొత్తానికి ఖలేజా ఈ రీ రిలీజ్తో సంచలనంగా మారడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించగా.. సి. కళ్యాణ్, సింగనమల రమేష్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు.