‘ కన్నప్ప ‘ హార్డ్ డిస్క్ మాయం వెనక అతడి హస్తం.. ప్రూఫ్స్ తో సహా దొరికిపోయాడుగా..!

టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మంచు కుటుంబంలో చెలరేగిన వివాదాల కారణంగా ప్రస్తుతం ఈ ఫ్యామిలీ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. మంచు వారసులు మనోజ్, విష్ణుల మధ్యన గొడవలు కాస్త చిలికి చిలికి గాలివానై.. పోలీస్ స్టేషన్‌లు, కోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో.. ఈ వార్త‌లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే.. మంచు విష్ణు.. ఇప్పటివరకు మనోజ్ పై ఎలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయకపోయినా.. మనోజ్ ఇప్పటివరకు విష్ణు పై ఎన్నో సంచలన ఆరోపణలు చేస్తూ వచ్చాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్ పోయిందంటూ న్యూస్ దుమ్మారం రేపిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. ముంబైకి చెందిన ఒక విఎఫ్ఎక్స్ సంస్థ కన్నప్ప సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్‌ షార్ట్స్ మొత్తాన్ని పూర్తిచేసి హార్డ్ డ్రైవ్‌లో సేవ్ చేయగా.. దాన్ని రఘు అనే వ్యక్తి చరిత అనే అమ్మాయికి ఇవ్వడం.. తను ఆ హార్డ్ డిస్క్ తో పరారై పోవడం వార్తల్లో తెగ వైరల్ గా మారింది. ఇలాంటి నేపథ్యంలో మంచు విష్ణు టీమ్ అంతా దీని వెనుక మంచు మనోజ్ కుట్ర ఉందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Case Filed Against 24 Frames Staff In Kannappa Movie Hard Drive Theft

రఘు అనే వ్యక్తి మనోజ్‌కు పియే అని.. చరిత కూడా అతని దగ్గర పనిచేస్తుందని.. మనోజ్ ఆఫీస్‌లోనే ఉంటుందని.. కచ్చితంగా హార్డ్ డిస్క్ మాయం వెనుక మనోజ్ కుట్ర దాగి ఉందని.. చాలా కాలం నుంచి కన్నప్ప సినిమా ఆన్లైన్లో లీక్ చేస్తామంటూ మనోజ్ టీం మమ్మల్ని బెదిరిస్తున్నారని.. 45 రోజుల క్రితం ముంబైలోని హైవే స్టూడియోస్ నుంచి కొరియర్ ద్వారా విష్ణు ఇంటికి వచ్చిన హార్డ్‌ డ్రైవ్ పార్సెల్ సెక్యూరిటీ తీసుకోకుండా.. మనోజ్ పీఏ, అసిస్టెంట్ అడ్డుపడ్డారని.. విష్ణు టీం మనోజ్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఈ హార్డ్ డిస్క్ లో మొత్తంగా గంటన్నర సినిమా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

Manchu Manoj startling revelations over Kannappa delay | cinejosh.com

కాగా.. ఇదంతా కేవలం సినిమా పబ్లిసిటీ కోసమే చేస్తున్నారని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే.. హార్డ్ డిస్క్ మాయమైందని వార్త బయటకు వచ్చినప్పుడే ఇదంతా మనోజ్ చేసాడని.. విష్ణు కచ్చితంగా డ్రామా ప్లే చేస్తాడు.. పబ్లిసిటీ చేయిస్తాడు అని ఊహించామంటూ మరి కొంతమంది నెటిజ‌న్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం మనోజ్ భైరవం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నారు. ఈనెల 30న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టి స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్ ఇవ్వాలని మనోజ్ ప్రయత్నిస్తున్నారు. ఓ పక్కన ఆయన తన సినిమా పనులతో బిజీగా ఉంటే.. ఇంత కుట్రకు పాల్పడాల్సిన పని ఆయనకు ఏముంది.. అంత తీరిక ఎక్కడ దొరుకుతుంది అంటూ మనోజ్ అభిమానులు మండిపడుతున్నారు. ఇక ఈ వార్తలకు చెక్ పడాలంటే మనోజ్‌ స్వయంగా రియాక్ట్ అవ్వాల్సిందే.