శిరీష్ రెడ్డిని కాపాడేందుకే నాపై ఇలాంటి ఆరోపణలు చేశాడు.. దిల్ రాజు పై సత్యనారాయణ ఫైర్..

టాలీవుడ్‌లో థియేటర్ల బంద్ వివాదం ఏ రేంజ్ లో ప్రకంపనులు సృష్టించిందో తెలిసిందే. దీంతో ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ అనుశ్రీ సత్యనారాయణపై ఆరోపణలు చేశాడు.. ఈ నేప‌ద్యంలో జనసేన ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న అనుశ్రీ సత్యనారాయణను ప‌వ‌న్‌ సస్పెండ్ చేశాడు. కాగా తాజాగా స‌త్య‌నారాయ‌ణ ఈ వివాదంపై రియాక్ట్ అయ్యాడు. త‌ను మాట్లాడుతూ.. థియేటర్లో బంద్ గురించి దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ఈనెల 18, 19 తేదీల్లో తొడగొట్టి మరి ప్రకటించాడని.. ఈ అంశాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారు, సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇద్దరు సీరియస్గా తీసుకోవడంతో దిల్ రాజు రివర్స్‌లో నాపై బురద జల్లుతున్నార‌ని.. సత్యనారాయణ మండిపడ్డాడు.

సోదరుడు శిరీష్ రెడ్డిని కాపాడేందుకు.. దిల్ రాజు ఇలాంటి ఆరోపణలు నాపై తోస్తున్నాడని.. అబాండాలు వేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. రాజమహేంద్రవరంలో బుధవారం విలేకరుల మీటింగ్ ఏర్పాటు చేసిన స‌త్య‌నారాయ‌ణ షాకింగ్ విషయాలను వెల్లడించాడు. ఈ బంద్‌ విషయం కొద్ది రోజులుగా వినిపిస్తున్న నలుగురు నిర్మాతలు.. దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, ఏషియన్ సునీల్ అంటూ వివరించాడు. ఏప్రిల్ 19న రాజమహేంద్రవరం లో జరిగిన డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ల‌ సమావేశంలో.. థియేటర్ల‌ బంధ్‌, సమ్మె ప్రస్తావనకు రాలేదని.. బంద్‌కు సంబంధించి ఎగ్జిబిటర్ల సంఘం చైర్మన్‌కు దిల్ రాజు, సురేష్ బాబు ఫోన్లు చేసి ఒత్తిడి చేయడంతోనే.. చాంబర్‌కు లేఖ్ పెట్టారని అది వాస్తవమా.. కాదా.. అంటూ ప్రశ్నించాడు.

సింగల్ స్క్రీన్ ధియేటర్లు నష్టాల్లో ఉన్నాయని.. పర్సంటేజీ విధానం ఉంటే బాగుంటుందని రాజమహేంద్రవరంలో నిర్వహించిన అంతర్గత సమావేశాల్లో చర్చించామే కానీ.. జూన్‌లో బంద్ అనే ప్రసక్తి మా దగ్గర అసలు రానేలేదని.. పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిస్టిబ్యూటర్లను విజ్ఞప్తి చేసేందుకు ఏప్రిల్ 19న సమావేశాన్ని ఏర్పాటు చేస్తే.. దాన్ని తప్పు దోవలో చూపించి నాపై అబాండాలు వేసారంటూ చెప్పుకొచ్చాడు. ఈనెల 13న ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇబ్బంది ఉంటే థియేటర్లను మూసేస్తామని మాత్రమే నేను అన్నా.. అప్పటికే హరిహర వీరమల్లు రిలీజ్ తేదీ అసలు ప్రకటించనే లేదు. బంధ్ తెరపైకి వచ్చిన వెంటనే అటువంటిదేమీ లేదని నేనే ముందుగా ప్రకటించా అంటూ చెప్పుకొచ్చాడు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. నా దేవుడు సినిమాపై కుట్ర చేస్తానా అంటూ నిలదీశాడు. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నానని.. ప్రాణం ఉన్నంతవరకు పవన్ తోనే ఉంటానని.. వాస్తవాలను పార్టీ పెద్దలకు వివరిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.