బ్రేకింగ్ : ఆపరేషన్ సిందూర్ ఇంకా అయిపోలేదు IAF సంచలనం

ప‌హ‌ల్గాం ఎటాక్ తర్వాత ప్రతీకార చర్యగా భారత్, పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏకంగా తొమ్మిది ఉగ్ర స్థావరాలను టార్గెట్గా చేసుకొని నేలమట్టం చేసేసింది. ఈ ఆపరేషన్‌లో వందమంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ క్రమంలోనే పాక్, భారత్ పై ప్రతికార దాడి ప్రారంభించింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష వార్ మొదలైంది. బోర్డర్‌లో ఉత్రికత వాతావరణం నెలకొన్న క్రమంలో ప్రపంచ దేశాలు రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలని కోరుకున్నాయి.

తాజాగా.. ఈ రెండు దేశాల మధ్యన సమన్వయం కుదిరిందని.. ఇకపై కాల్పులు జరగవు అంటూ రెండు దేశాలు ధ్రువీకరించాయి. అయితే రెండు దేశాలు ఒప్పందం కుదిరిన తర్వాతనే తన వక్ర బుద్ధిని చూపించింది. డ్రోన్‌ల‌ను భారత్ బోర్డర్స్ వైపుకు వదిలింది. జమ్మూ కాశ్మీర్ పలు ఏరియాలో పాకిస్తాన్ డ్రోన్‌లు దూసుకు వచ్చాయి. పాకిస్తాన్ ఎందుకు అలా చేసిందో కారణాలు తెలియక ముందే ఇప్పుడు మరోసారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ట్వీట్ నెట్టింట సంచలనం సృష్టిస్తుంది.

Indian Air Force - Wikipedia

ఆపరేషన్ సింధు ఇంకా కొనసాగుతోందని ఐఏఎఫ్ ప్రకటించడం విశేషం. దీనిపై పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఐఏఎఫ్ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్‌పై ఊహాగానాలను అసలు నమ్మవద్దని ఆపరేషన్ సింధూర్‌లో తమకు ఇచ్చిన పనిని అత్యంత ఖచ్చితత్వంతో విజయవంతంగా పూర్తి చేశామని.. ఐఏఎఫ్ వెల్లడించింది. భారత్, పాక్ మధ్య సీజ్‌ఫైర్ కుదిరిన వేళ‌ ఇండియన్ ఎయిర్ఫోర్స్ చేసిన ఈ ప్రకటన నెటింట‌ సంచలనం సృష్టిస్తుంది. అసలు ఏం జరగనుంది.. మళ్లీ వార్‌ కొనసాగుతుందా అనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి.