ఇండస్ట్రీలో గత కొద్దిరోజులుగా జయం రవి, ఆర్తి విడాకులు న్యూస్ తెగ వైరల్గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో జయం రవి తన ఎక్స్ వేదికగా.. సెన్సేషనల్ విషయాలను షేర్ చేసుకోవడం హాట్ టాపిక్గా మారింది. త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతుందని క్యాప్షన్ను జోడించి ఆయన షేర్ చేసిన పోస్ట్ పట్ల రకరకాల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జయంరవి, ఆర్తిని విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే మొదట ఆర్తి తనకు ఈ విడాకులు ఇష్టం లేదని చెప్పినా.. తర్వాత ఏ ఓ కారణాలతో దీనికి ఒక్కోవాల్సి వచ్చింది. అయితే పార్టీ తాజాగా తనకు నెలకు రూ.40 లక్షల భరణం కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఇలాంటి నేపథ్యంలో తాజాగా తన ఎక్స్ వేదికగా జయం రవి గుడ్ న్యూస్ కమింగ్ సూన్ అంటూ ఫోన్ పట్టుకొని మాట్లాడుతూన పిక్ షేర్ చేసుకున్నాడు. అయితే త్వరలోనే జయం రవికి విడాకులు రాబోతున్నాయని దీనిపైన ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నాడు కావచ్చు అంటూ అందరిలోనూ సందేహాలు మొదలయ్యాయి. అయితే.. జయం రవి పోస్ట్ పై ఒక్కొక్కరు ఒక విధంగా రియాక్ట్ అవుతుంటే ఆడవాళ్లు మాత్రం ఆయనపై నిప్పులు చెరుగుతూ.. నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అసలు నువ్వు మనిషివేనా.. పెద్ద సైకో.. పెళ్లై భార్య ఉన్న వేరొకరితో కూలికిందే కాకుండా.. ఆమెపై ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నావా అంటూ ఫైర్ అవుతున్నారు.
అసలు నీలాగే నీ భార్య కూడా వేరొకరితో ఉండి ఉంటే ఏం చేసేవాడివి.. నువ్వు చేసింది నీకు ఖచ్చితంగా కర్మ రూపంలో రిటర్న్ అవుతుంది అంటూ మండిపడుతున్నారు. ఇక గతంలో ఆర్తి.. జయం రవి కోసం సూసైడ్ అటెంప్ట్ చేసిన.. దానిని గుర్తు చేసుకుంటూ నీలాంటి వాడి కోసం ఆమె సూసైడ్ చేసుకోవాలనుకుంది అంటూ.. నువ్వు దానికి అర్హుడవే కావు అంటూ రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా జయం రవి తాజాగా ఎంతో హ్యాపీగా ఉన్నట్లు పోస్ట్ షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు ఆర్తి అభిమానులకు, నెటిజన్లకు నచ్చడం లేదు. ఇక అఫీషియల్ గా విడాకులు వచ్చిన వెంటనే జయం రవి.. సింగర్ కెనీషాను అఫీషియల్ గా మ్యారేజ్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం.