తెలుగు హీరోయిన్‌కు కార్నియా డ్యామేజ్‌.. ప్ర‌మాదంలో కంటిచూపు…?

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో చిన్న వారి నుంచి పెద్దవారి వరకు అందరూ బాధపడుతున్న సమస్య కంటి చూపు మందగించడం. కంటి చూపు సమస్యలకు సాధారణంగా చాలామంది కళ్లద్దాలకు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అయితే కొందరికి స్పెట్స్‌ పెట్టుకోవడం ఇష్టం లేక.. కాంటాక్ట్ లెన్స్ పై ఆధారపడతారు. అందులోను లేటెస్ట్ మోడల్ టెక్నాలజీకి తగ్గట్లుగా వాడుతుండటం కూడా సాధారణం. అయితే ఈ కాంటాక్ట్ లెన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. లెన్స్ సరిగా ఉపయోగించకపోయినా.. కొన్ని సందర్భాల్లో కంటి చూపు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. తాజాగా అలాంటి పరిస్థితి ఒక టాలీవుడ్ హీరోయిన్ కు ఎదురయిందట‌.

లెన్స్‌ సరిగా ఉపయోగించకపోవడంతో తనకు కళ్ళు కనిపించడం లేదంటూ ఎమోషనల్ అయినా ఈ అమ్మడు.. ప్రస్తుతం కంటికి వైట్ బ్యాండేజ్‌తో కనిపించింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరు.. అనుకుంటున్నారా. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ జాస్మిన్. తెలుగులో దిల్ ఉన్నోడు, వేట, లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన జాస్మిన్‌.. తర్వాత కన్నడ, మలయాళం సినిమాల్లోనూ ఆకట్టుకుంది. బాలీవుడ్ బిగ్ బాస్ 14, ఖ‌త్రోంకి ఖిలాడి లాంటి రియాలిటీ షోలను పాల్గొని అక్కడ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక ఇటీవల తాను లెన్స్ ఉపయోగించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ వివరించింది.

ఆమె జూలై 17న ఇంపార్టెంట్ పనితో ఢిల్లీకి వెళ్లానని.. ప్రోగ్రాంకు రెడీ అవుతున్న క్రమంలో కళ్ళకు లెన్స్ పెట్టుకుంటే ఎందుకో చాలా ఇబ్బందిగా, నొప్పిగా అనిపించిందని.. తర్వాత ఆ నొప్పి మరింతగా ఎక్కువ అవడంతో ఈవెంట్‌లో సన్ గ్లాసెస్ పెట్టుకొని ఎలాగోలా మ్యానేజ్ చేశానని వివరించింది. అయితే ఓ టైంలో నాకు అసలు ఏమీ కనిపించలేదని.. ఎలాగోలా కష్టం మీద పని పూర్తి చేసుకుని డాక్టర్ దగ్గరికి వచ్చాను అని కార్నియా డామేజ్ అయిందని.. కళ్ళకు బ్యాండేజ్ వేసారని చెప్పుకొచ్చింది. ఈ పెయిన్ తగ్గడానికి కనీసం నాలుగు నుంచి ఐదు రోజులు పడుతుంద‌ట‌.. నొప్పి మాత్రం భరించలేనంతగా ఉందంటూ వాపోయింది. దీంతో సరిగ్గా చూడలేకపోతున్నా, నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదంటూ జాస్మిన్ వివరించింది. ఈ క్రమంలో ఆమె కళ్ళకు వైట్ బ్యాండేజ్ తో ఉన్న ఫొటోస్ తెగ వైరెల్ గా మారుతున్నాయి. వాటిని చూసినా అభిమానులంతా అమ్మడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.