ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల రిజల్ట్తో ప్రభుత్వం మారిపోయిన సంగతి తెలిసిందే. టీడీపీ పవర్లోకి వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక పవర్ స్టార్ రాకతో సినీ ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయని ఎప్పటినుంచో ఇండస్ట్రీ వారంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో అందరికళ్ళు ఈనెల 22న రిలీజ్ కానున్న ప్రభాస్ కల్కిపై పడ్డాయి. టికెట్ రేట్లు పెంపు స్పెషల్ షో పర్మిషన్ల గురించి నెట్టింట చర్చనీయాంసంగా మారింది. ఈ క్రమంలో అర్ధరాత్రి ప్రీమియర్ల మీద కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. అయితే రాత్రి ఒంటిగంట షో చేయాలా వద్దా అని కల్కి బృందం ఇంకా తుది నిర్ణయాన్ని తీసుకోలేదని తెలుస్తుంది. దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికి టీం మధ్యన జరుపుతూనే ఉన్నారట.
యుఎస్ లో అదే సమయానికి ప్రీమియర్లు రిలీజ్ అవుతాయి. అంటే ఇండియాలో ఉదయం లేచే సమయానికి యూఎస్ నుంచి రివ్యూలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. అడ్వాన్స్ బుకింగ్లు హాట్ కేక్స్లా టికెట్లు అమ్ముడుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి, సలార్ సినిమాల కంటే కల్కి ఎక్కువగా ఓపెనింగ్ కలెక్షన్ కాబట్టి ఇప్పటికే రికార్డులు సృష్టించింది. ఈ క్రమంలో ప్రీమియర్ షోలు బయటకు వేస్తే రిపోర్ట్లు, స్పాయిలర్లు కూడా ఎక్కువ అయిపోతాయి. సినిమా బానే ఉంది కాబట్టి ఇది సినిమాకు మంచి ప్లేస్ అవుతుంది. కానీ కొంచెం అటూ ఇటూ అయినా కూడా ఓపెనింగ్స్ మళ్లీ కలెక్షన్లకు కూడా భారీ దెబ్బ అయ్యే సమస్య ఉంది.
ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి ఈ సినిమా షోలు పడాలి అంటే ఇండియా మొత్తంలో ఒకేసారి అర్ధరాత్రి షోలను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ సింగిల్ స్క్రీన్ లవర్ కైనా అర్ధరాత్రి ఒంటిగంట షో చేసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే సమయానికి షో పడాలంటే అక్కడ కూడా పర్మిషన్లు తెచ్చుకోవాలి. ఈ క్రమంలో నిర్మాత అశ్విని దత్త్, డైరెక్టర్ నాగ అశ్విన్, దీనిపై చర్చలు నడుపుతున్నారని.. తుది నిర్ణయానికి ఇంకా సమయం పడుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలో జనాలు థియేటర్ల దగ్గర ఫుల్ అవుతారని బయ్యర్లు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి వారాంతం కంప్లీట్ అయ్యేసరికి కలెక్షన్లు ఆకాశాన్ని అంటుతాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.