నందమూరి నట వారసులుగా ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది అడుగుపెట్టినా.. కేవలం బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే ఆ ఇమేజ్ను నిలుపుకోగలిగారు. సీనియర్ హీరో బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల అందరిలో టాప్ పొజిషన్లో దూసుకుపోతుండగా.. ఎన్టీఆర్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ మొదట్లో హీరోగా ఊహించిన రేంజ్లో సక్సెస్ అందుకోకపోయినా.. బింబి సారతో రియంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని స్టార్ హీరో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా, నిర్మాతగా రాణిస్తున్న కళ్యాణ్ రామ్.. కొద్దిరోజుల క్రితం తన 21వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసింద. NKR 21 రన్నింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా రానున్నట్లు సమాచారం. ఈ మూవీకి ప్రదీప్ చిలుకూరి దర్శకుడుగా వ్యవహరించినన్నాడు. ఇందులో కళ్యాణ్ రామ్ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండబోతుందట. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది.
అదేంటో కాదు.. NKR 21కు మెగా హీరో టైటిల్ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో రామ్ చరణ్, కాజల్ కాంబోలో ” మెరుపు ” టైటిల్ తో సినిమా వస్తుందంటూ అఫిషియల్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలు కూడా పూర్తయిన తర్వాత సినిమా ఆగిపోయింది. అయితే ఇప్పుడు అదే టైటిల్ను కళ్యాణ్ రామ్ 21వ సినిమాకు మేకర్స్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నారని ఫీల్మ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కాగా ఈ సినిమాలో అందాల చందమామ సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఆకట్టుకోనుంది.