‘ ఫిదా ‘ కాంబో మళ్లీ రిపీట్.. ఈసారి అంతకుమించిన బ్లాక్ బస్టర్ పక్క అంటూ..?!

శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో.. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించి బ్లాక్ బ‌స్ట‌ర్‌ సక్సెస్ సాధించిన ఫిదా మూవీ కి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా.. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే.. ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది.

Varun-Tej-Sai-Pallavi-and-Sekhar -Kammula-in-Pre-production-workshop-1_compressed.jpg?fit=5760,3840&quality=80&zoom=1&ssl=1

కాగా ప్రస్తుతం ఈ కాంబోలోనే మరో సినిమా రిపీట్ కానుందంటూ వార్తలు వైర‌ల్‌గా మారాయి. ప్ర‌స్తుతం శేఖ‌ర్ ఖ‌మూలా కుబేర, వరుణ్ తేజ్ మట్కా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి కాగానే వీరి కాంబోలో మ‌రో సినిమా సెట్స్ పైకి రానుంద‌ని.. వ‌రుణ్‌కోసం శేఖ‌ర్ ఫదాను మించిపోయే లెవెల్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైన‌ర్‌ సిద్ధం చేశాడట‌.

Fidaa total worldwide box office collection: Varun Tej film crosses Rs 60  crore mark in 14 days - IBTimes India

ఇక కథ బాగా నచ్చడంతో వరుణ్ తేజ్ ఈ ప్రాజెక్టుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఓ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్క‌నుంద‌ట‌. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాతో ఫిదా ను మించిన బ్లాక్ బస్టర్ వరుణ్ తేజ్ సాధించడం ఖాయం అంటూ మెగా అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.