టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, బాలీవుడ్ సహా అన్ని సినిమా ఇండస్ట్రీలలో ప్రతిష్టాత్మక సినిమా అవార్డు ఉంటాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంది అవార్డ్స్ అత్యంత ముఖ్యమైనవి.1977 నుంచి ఈ అవార్డుల ప్రదానం కొనసాగుతోంది. దాదాపు 40 సంవత్సరాలుగా ఈ అవార్డులు అందజేస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఈ అవార్డుల గురించి అంతగా ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఇప్పుడు సినిమాల స్థాయి కూడా పాన్ ఇండియా లెవెల్ ప్రపంచ సినిమాలు స్థాయికి వెళ్లడంతో నంది అవార్డుల ప్రాముఖ్యత తగ్గింది.
తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మాత్రం ఈ అవార్డులపై ఆసక్తి చూపించడం లేదు. గతంలో టిడిపి హయాంలో మాత్రం 2017 లో ఈ అవార్డులను ప్రకటించారు.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఈ అవార్డులపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఇప్పుడు మరోసారి ఈ అవార్డులపై టాలీవుడ్ పెద్దలు మరోసారి నోరు విప్పడంతో ఇవి మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అలాంటి ఈ నంది అవార్డులను చివరిసారిగా తీసుకున్న హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
-1964లో ఉత్తమ ఫీచర్ ఫిలింగా డాక్టర్ చక్రవర్తి సినిమా ఎంపికైంది. అప్పుడు కేవలం ఉత్తమ చిత్రం కేటగిరీ మాత్రమే ఉండేది.
-1977 నుంచి నటీనటులు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు పురస్కారం ఇచ్చే పరంపర మొదలైంది.
-ఎక్కువ నంది అవార్డులు అందుకున్న హీరో నాగార్జున. నటుడిగా నాలుగు, నిర్మాతగా ఐదు నందులు గెలుపొందారు.
– 8 నంది పురస్కారాలతో మహేశ్బాబు ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు.
-వెంకటేశ్, జగపతి బాబు 7 సార్లు, చిరంజీవి, కమల్ హాసన్, బాలకృష్ణ మూడేసి చొప్పున నందులు పొందారు.
-2016లో చివరగా జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్గా(నాన్నకు ప్రేమతో) అవార్డు అందుకున్నారు.
-ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి 11సార్లు నంది అవార్డు అందుకున్నారు.