యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలోనే యూఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రక్షితారెడ్డితో నిశ్చితార్థం జరిగింది.హైదరాబాద్లో జరిగిన ఈ ఎంగేజ్మెంట్కు రామ్చరణ్, ఉపాసన, సిద్దార్థ్, అదితిరావు హైదరీ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగి దాదాపు ఐదు నెలలు కావాల్సి వస్తుంది. ఇంతవరకు వీరు పెళ్లి గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రాకపోవడంతో పెళ్లి బ్రేక్ అయ్యిందనే వినిపించిన సంగతి తెలిసిందే. శర్వానంద్ తన పెళ్లి రద్దు చేసుకున్నాడు అంటూ వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదు. అవి కేవలం కొంతమంది కావాలనే దుష్ప్రచారాలు చేస్తున్నారని,ప్రస్తుతం శర్వానంద్ ఓ సినిమా షూటింగ్లో ఉన్నారని, ఈ తాజాగా లండన్లో షూటింగ్ కంప్లీట్ చేశారని, త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకుంటారని క్లారిటీ ఇచ్చారు.
శర్వానంద్ ఎంగేజ్మెంట్ అయిన వెంటనే తన పెళ్లిని ఈనెల చివరలో చేసుకోవాలని భావించారట. అంతేకాకుండా జైపూర్లో ఓ భారీ ప్యాలెస్ ని కూడా బుక్ చేశారట. అయితే అందరూ ఒకే అన్న సమయంలో శర్వానంద్ సోదరి వల్ల అసలు చిక్కు వచ్చి పడిందట. శర్వానంద్ సోదరీ విదేశాలలో ఉండడం వల్ల ఆమె పెళ్లికి రావడానికి టైం కుదరడం లేదు.
దీంతో తన సోదరి రాకుండా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక శర్వానంద్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా శర్వానంద్ పెళ్లి డెట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. వచ్చే నెల మొదటి వారంలో వీరి పెళ్లి డెట్ పిక్స్ అయిన్నట్లు తెలుస్తుంది. అప్పటికి శర్వానంద్ సోదరీ కూడా వచ్చేస్తారని తెలుస్తుంది.