ఆ మూవీలో నటించడం కోసం రాత్రులు నిద్రపోకుండా ఆ పని చేసిన త్రిష!

సుదీర్ఘకాలం నుంచి సౌత్ లో హీరోయిన్గా కెరీర్‌ను రాణిస్తున్న త్రిష.. రీసెంట్గా `పొన్నియన్ సెల్వన్` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో త్రిష తో సహా విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్ వంటి స్టార్లు నటించారు. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా చోళుల కథతో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు.

సెప్టెంబర్ 30న ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. ఇక ఈ చిత్రంలో త్రిష చోళ రాకుమారి కుందువై పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తన పాత్రకు వందకు వంద శాతం న్యాయం చేసింది. ఆమె కెరీర్లో లుక్స్ పరంగా కుందువై క్యారెక్టర్ బెస్ట్ అండ్ టాప్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ సినిమా చేయడానికి త్రిష కాస్త గట్టిగానే కష్టపడిందట.

డైరెక్టర్ ఆమెకు క‌థ చెప్పగానే త్రిష వెంట‌నే ఓకే చెప్పేసింద‌ట‌. అయితే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసే స‌మ‌యానికి మ‌హ‌మ్మారి క‌రోనా కార‌ణంగా ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్లి పోయింది. ఇక దొరికిందే ఛాన్స్ అనుకున్న‌ త్రిష.. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఐదు భాగాలను మొత్తం చదివేసింద‌ట‌. అలా బుక్స్ చదవడం కోసం త్రిష ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి తన మైండ్ కి ఆ కథను ఎక్కించుకుందట. ఈ విష‌యాన్ని త్రిష స్వ‌యంగా వెల్ల‌డించింది. ఇక ఆ కార‌ణంగానే కుందువై పాత్రలో అంత‌లా ఒదిగిపోయి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌గ‌లిగింది.