హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన శృతిహాసన్.. ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా..?

శృతిహాసన్.. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురు అయినప్పటికీ తనకంటూ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఇటు తెలుగులోనూ అలాగే అటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఒకప్పుడు టాలీవుడ్ లో ఐరన్ లెగ్ అని అవమానాలు ఎదుర్కొన్న శృతిహాసన్ ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటించి తన సత్తా చాటుతుంది.

శృతిహాసన్ ప్రస్తుతం గోపి చంద్ మాలినేని డైరెక్షన్లో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న ఎన్ బి కె 107 లోను, అలాగే బాబి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న `వాల్తేరు వీరయ్య` సినిమాలోని హీరోయిన్గా నటిస్తుంది. అంతేకాకుండా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న `సలార్` సినిమాలో కూడా శృతిహాసన్ నే హీరోయిన్ గా చేస్తుంది. తాజాగా ఈ పిల్లి కళ్ళ భామ సోషల్ మీడియా వేదికగా ఓ గుడ్ న్యూస్ అందరితోనూ షేర్ చేసుకుంది.

 

అదేమిటంటే తాను ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించింది. హాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమైన శృతిహాసన్ తాజాగా ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్టులో “నేను గ్రీస్లో ఎందుకు ఉన్నాను“ అనే విషయం మీతో పంచుకుంటునందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని పేర్కొంది. అంతేకాకుండా `ఈ ప్రత్యేక ప్రాజెక్టులో భాగమైనందుకు చాలా ఎగ్జైట్ అవుతున్నా` అని చెప్పుకొచ్చింది.

అయితే ప్రస్తుతానికి శృతి హాసన్ గ్రీస్లో ఉంది. అయితే `ది ఐ` అనే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాగా ఇందులో స్కాటిష్ యాక్టర్ మార్క్ రౌలే సరసున శృతిహాసన్ హీరోయిన్గా కనిపించబోతున్నది. ఈ సినిమాలో శృతిహాసన్ పెళ్లయిన కొద్ది నెలల్లోనే భర్తను కోల్పోయిన విధవరాలి పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. తన భర్త మరణించిన దీవికి భర్త అస్థికలను కలపడానికై ఒంటరిగా ప్రయాణమైన ఆమె ఒక మహిళగా తన జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య సంఘటనలతో ఈ సినిమా కథ తిరుగుతుందని సమాచారం. ఇక ప్రస్తుతం శృతిహాసన్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

https://twitter.com/shrutihaasan/status/1583137182369296384?s=20&t=2RGt0uZdeveGmR4_NnfozA