మహేష్ సల్మాన్ లకు కొత్త తలనొప్పి తెచ్చిన పూజా హెగ్డే.. ఏం జరిగిందంటే?

పూజా హెగ్డే.. ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకెళ్తుంది. అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిన ఈ బుట్ట బొమ్మ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. గతంలో తెలుగులో వ‌రుస ప‌రాజయాలు నమోదు చేసి గోల్డెన్ లెగ్ ఇమేజ్ తెచ్చుకున్న పూజ హీరోయిన్గా నటించిన ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూశాయి. వరుస ఫ్లాపులతో పూజ ఇమేజ్ ఒక్కసారిగా తలకిందులు అయింది.

 

ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్ బాబు సరసన త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కనున్నది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తిచేసుకుని సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా వరుస ఫ్లాపుల్లో ఉన్న పూజకి ఇది కమ్ బ్యాక్ సినిమా అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి జంటగా “కిసీ కి భాయ్ కిసీ కా జాన్“ అనే సినిమాలో కూడా పూజ నటిస్తుంది. అంతేకాకుండా రణ్ వీర్ సింగ్ జంటగా కూడా ఓ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇటువంటి ఫుల్ బిజీ షెడ్యూల్స్ మధ్య ఆమె కాలికి గాయమైందన్న విషయం ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం కాలికి కట్టు కట్టుకుని ఉన్న పూజా హెగ్డే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కాలికి గాయంతో కూడా షూట్ లో పాల్గొంటున్నట్టు తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో వీడియో పోస్ట్ చేసి దాని కింద “ఏదైనా కానీ పని చేసుకుంటూ పోవాల్సిందే“ అని కామెంట్ రూపంలో వివరణ ఇచ్చింది. పూజా కాలికి గాయమైన నేపథ్యంలో సల్మాన్, రణ్ వీర్ , మహేష్ చిత్రాలపై ప్రభావం పడే అవ‌కాశం ఉందా? వారికి తలనొప్పిగా మార‌నుందా? అని చూడాలి. పూజ ఒకవేళ షూటింగ్లో పాల్గొన లేకపోతే షెడ్యూల్స్ డిజాస్టర్ అయ్యే అవ‌కాశం ఉంది అని స‌మాచారం. ఈ నేపథ్యంలో సినిమా మేకర్స్ ని కూడా పూజ హెగ్డే పోస్ట్ కలవర పెడుతుందట‌. దీంతో ఆమె అభిమానులు ఆమె కాలికి ఏమైంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.