కే జి ఎఫ్ సినిమాలతో ప్రపంచ స్థాయి క్రేజ్ను దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తన తర్వాతి సినిమాని పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో భారీ మాస్ యాక్షన్ సినిమాగా సలార్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాకి పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి మొదలుకానుంది. ఈ సినిమాని ఏ సినిమాలో లేనంతగా భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ .. పాన్ ఇండియా హీరో ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఆ రేంజ్ లో నే డైరెక్షన్ చేస్తున్నారట. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజునే మోస్ట్ వైలెంట్ మాన్ అని ట్యాగ్ తో ఈ సినిమాని మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ బయటికి వదిలారు మేకర్స్.. ఈ సినిమాలో యాక్షన్ ఎలివేషన్ భారీ స్థాయిలో ఉంటుందని అర్థం అవుతుంది. సినిమా మొదలైన అప్పటినుంటే భారీ యాక్షన్ అని ఒక మాట తప్ప ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ బయటికి రావట్లేదు.
దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఏదైనా అప్డేట్ ఇస్తే సినిమాలో యాక్షన్ అనే మాట లేకుండా మరో అప్డేట్ ఇవ్వండి అంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు కోపంతో సోషల్ మీడియా వేదిక సలార్ టీం పై కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
VIOLENT
— Salaar (@SalaarTheSaga) September 3, 2022