యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఎన్టీఆర్కి జోడీగా ఒలీవియా మోరిస్, చరణ్కి జోడీగా ఆలియా భట్ నటించారు.
అలాగే అజయ్ దేవ్గన్, శ్రియా సరన్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ టీమ్కి నేడు ఎంతో స్పెషల్.
ఎందుకో తెలుసా.. ఈ సినిమాను ప్రకటించి నేటితో నాలుగేళ్లు పూర్తి అయింది. అవును, 2017లో సరిగ్గా ఇదే రోజు నాడు ‘ఆర్ఆర్ఆర్’ అనే పాన్ ఇండియన్ సినిమాను రూపొందించబోతున్నట్టుగా దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఎన్టీఆర్, చరణ్లతో దిగిన ఫొటోలు షేర్ చేశాడు.
ఈ నేపథ్యంలోనే ఆనాడు రాజమౌళి చేసిన ట్వీట్ను తాజాగా చిత్ర టీమ్ రీ ట్వీట్ చేస్తూ.. `ఆర్ఆర్ఆర్ సినిమా మొదలు పెట్టి 3 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. మరో 50 రోజుల్లో ఈ సినిమాను రిలీజ్ చెయ్యడానికి సిద్దం చేస్తున్నాం.ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం. జనవరి 7న కలుద్దాం. లెట్స్ బ్లాస్ట్` అని పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేసింది.
4 years since he posted this pic leaving room for so many speculations… 3 years since we began filming #RRRMovie… 50 Days for you to experience the magic on the big screen 💥💥
Oohinchani Chitra Vichitram… Snehaaniki Chaachina Hastham…❤️🙌🏻
Jan 7th, Let’s blast!! https://t.co/S0prnnO4FM
— RRR Movie (@RRRMovie) November 18, 2021