`ఆచార్య‌`కు అనుకోని క‌ష్టం..ఈసారి ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి మ‌ణిశ‌ర్మ సంగీతం స‌మ‌కూర్చుతున్నారు.

Chiranjeevi's 'Acharya' to release worldwide on May 13, Trailer out | Regional-cinema News – India TV

అయితే నిజానికి ఈ సినిమా మే నెల‌లో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా షూటింగ్ గత మూడేళ్ళుగా సాగుతూనే ఉంది. క‌రోనాతో స‌హా వివిధ కారణాల వల్ల ఆచార్య షూటింగ్ కు బ్రేకులు పడుతూ ముందుకు సాగుతూ కదులుతోంది. ఇక ఎలాగోలా టాకీ పార్ట్ ను పూర్తి చేసారు.

Chiranjeevi and Ram Charan's Acharya shoot is almost done, just two songs to go - Movies News

ఇంకా రెండు పాటల షూటింగ్ ను పూర్తి చేయాల్సి ఉండ‌గా.. ప్ర‌స్తుతం వాటిని కొర‌టాల త్వ‌ర‌గా ఫినిష్ చేయాల‌ని ఏర్ప‌ట్లు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు ఈ చిత్రానికి అనుకోని క‌ష్టం వ‌చ్చిప‌డింది. తాజాగా కొర‌టాల షూటింగ్‌కు ప్లాన్ చేయ‌గా.. వర్షాల వల్ల మరోసారి షూట్‌కి బ్రేక్ ప‌డింది. దాంతో చేసేదేమి లేక‌ వారం రోజుల తర్వాత షెడ్యూల్ ను ప్లాన్ చేసార‌ట‌. మ‌రి ఈ మూవీ షూట్ ఎప్పుడు పూర్తి అవుతుందో, ఎప్పుడు విడుద‌ల అవుతుందో చూడాలి.