న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `శ్యామ్ సింగరాయ్` ఒకటి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పిరియాడికల్ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.
ఇటీవల షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ న్యూ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ విషయంలో మేకర్స్కు, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కు మధ్య భారీ డీల్ కుదిరిందట.
లేటెస్ట్ సమాచారం ప్రకారం.. నెట్ ఫ్లిక్స్ శ్యామ్ సింగరాయ్ డిజిటల్ రైట్స్ ను ఏకంగా రూ. 40 కోట్లు కు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇక ముందుగా ఈ సినిమా థియేటర్లలో విడుదలై.. ఆ తర్వాత ఓటీటీలో విడుదల కానుందని సమాచారం. కాగా, ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా..జంగ సత్యదేవ్ కథ అందించారు.