బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పడుకోణెలు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు బిగ్ షాక్ ఇచ్చారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఫస్ట్ పార్ట్ను క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదల చేయబోతున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు గట్టి పోటీ ఇచ్చేందుకు మరో పాన్ ఇండియా మూవీ బరిలోకి దిగబోతోంది. టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్ జీవితాధారంగా రూపొందుతోన్న చిత్రం ‘83’.
కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కపిల్ దేవ్గా రణ్వీర్, ఆయన భార్య పాత్రలో దీపికా కనిపించనున్నారు. ఈ సినిమాను కూడా క్రిస్మస్ కానుకగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే రెండు పాన్ ఇండియా చిత్రాలు ఒకేసారి విడుదలైతే బాక్సాఫీస్ వార్ ఓ రేంజ్లో ఉంటుంది. పైగా థియేటర్స్ విషయంలోనూ క్లాషస్ ఏర్పడతాయి. అందుకే పుష్ప మేకర్స్ కాస్త ఆందోళన చెందుతున్నారని టాక్ నడుస్తోంది.