అక్కినేని వారి కోడలు సమంత తాజాగా క్షమాపణలు కోరింది. క్షమాపణలు కోరేంత తప్పు ఏం చేసింది..? ఈమె ఎవరికి క్షమాపణలు చెప్పింది..? అసలు మ్యాటర్ ఏంటి..? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ఈ మధ్య ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్లోలో సమంత పోషించిన రాజీ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రాజీ అనే శ్రీలంక తీవ్రవాది పాత్రలో సమంత అదరగొట్టేసింది. ఈ పాత్రకుగానూ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2021 ఉత్తమ నటి అవార్డును సమంత దక్కించుకుంది. అయితే ఈ పాత్రను పోషించినందుకు తమిళులు సమంతాపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తమిళ అమ్మాయి అయ్యుండి శ్రీలంక తీవ్రవాద పాత్రలో నటిస్తావా అంటూ ఈమెపై దారుణంగా విమర్శలు గుప్పించారు.
అయితే ఆ వివాదంపై అప్పట్లో ఎలాంటి స్పందన వ్యక్తపరచని సమంత ఎట్టకేలకు దిగొచ్చి క్షమాపణలు కోరింది. `ఇతరుల మనోభావాలు దెబ్బ తీయాలనే ఉద్ధేశం నాకు ఎప్పుడూ లేదు.. నిజంగా ఆ పాత్ర నాకు చాలా బాగా నచ్చిందని.. అందుకోసమే అందులో నటించాను. అయితే ఒకవేళ అది మీరు నచ్చకపోతే నన్ను క్షమించండి. నేను ఉద్ధేశపూర్వకంగా ఏదీ చేయలేదు. హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను` అని సమంత చెప్పుకొచ్చింది.