కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గుతూ వస్తోంది. థియేటర్లో ఓపెన్ అయ్యాయి. చిన్న చిన్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా హీరోలిద్దరూ వారం గ్యాప్లో థియేటర్లోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దేవకట్టా కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్`.
పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటించగా.. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా మేకర్స్ ప్రకటించారు.
మరోవైపు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం క్రిష్ దర్శకత్వంలో చేసిన విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నవల ‘కొండపాలెం’ ఆధారంగా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేయనున్నారు. అంటే వారం గ్యాప్లోనే ఇటు అన్న సాయి తేజ్ – అటు తమ్ముడు వైష్ణవ్ తేజ్ తమ సినిమాలతో థియేటర్స్లో సందడి చేయబోతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు విషయం సాధిస్తారో చూడాలి.