రెబల్ స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన డైరెక్టర్లలో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఒకరు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించనున్న ఈ పాన్ వరల్డ్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది.
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు దీపికా పుచ్చుకునే రెమ్యునరేషన్ హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాకుగానూ ఏకంగా 8 కోట్ల రూపాయలను ఛార్జ్ చేస్తోందని ప్రచారం జరుగుతోంది.
దేశవ్యాప్తంగా దీపికాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు కూడా వెనుకడుగు వేయలేదని సమాచారం. కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కూడా ఓ కీలక పాత్ర పోషించబోతున్న సంగతి తెలిసిందే.