రాజ‌కీయాల్లో కొత్త సంస్కృతికి తెర‌తీసిన జ‌గ‌న్‌

గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యానికి అడుగు దూరంలో నిలిచిపోయిన వైసీపీని ఈసారి ఎలాగైనా విజ‌య‌తీరాల‌కు చేర్చాల‌ని పార్టీ అధినేత జ‌గ‌న్ శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకే ఏరికోరి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా తిరుగులేని మైలేజ్ ఉన్న ప్ర‌శాంత్ కిశోర్‌ను ప‌క్క‌న‌పెట్టుకున్నారు. ఆయ‌న రాక‌తో వైసీపీకి తిరుగులేద‌ని నేత‌లు ధీమా వ్య‌క్తంచేస్తున్నారు. అందుకు త‌గిన‌ట్టే ఆయ‌న ప‌ని మొద‌లుపెట్టేశారు. సంప్ర‌దాయాల‌కు భిన్నంగా స‌రికొత్త పంథాలో వెళుతుండ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ్రామాల్లో సర్వేలు, ఎమ్మెల్యేల‌కు శిక్ష‌ణ శిబిరాలు, మ‌రీ ముఖ్యంగా ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా […]

వైసీపీ నిన్న హ్యాపీ… నేడు డీలా

క‌ర్నూలు జిల్లా వైసీపీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. నిన్న మాజీ మంత్రి శిల్పా మోహ‌న్‌రెడ్డి పార్టీలో చేర‌డంతో ఫుల్ ఖుషీగా ఉన్న జ‌గ‌న్ పార్టీకి ఆ మ‌రుస‌టి రోజే ఎవ్వ‌రూ ఊహించ‌ని షాక్ త‌గిలింది. భూమా ఫ్యామిలీకి చెందిన మంత్రి అఖిల‌ప్రియ ప్రాథినిత్యం వ‌హిస్తోన్న ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వైసీపీ జిల్లా ఉపాధ్య‌క్షుడు బోరెడ్డి ల‌క్ష్మీరెడ్డి త‌న ప‌ద‌వికి, పార్టీకి రాజీనామా చేశారు.  పార్టీకి రాజీనామా చేసిన ల‌క్ష్మీరెడ్డి పార్టీ అధిష్టానంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. వైసీపీలో డ‌బ్బున్న […]

పార్టీకి గుడ్ బై యోచ‌న‌లో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే..?

గుంటూరులో టీడీపీకి త్వ‌ర‌లోనే షాక్ త‌గ‌ల‌బోతోందా? కొంత కాలం నుంచీ ప్ర‌భుత్వ ప‌నితీరు, అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే.. పార్టీకి `ఇక సెల‌వు` అంటూ త‌న దారి తాను చూసుకోవాలని నిర్ణ‌యించుకున్నారా? అంటే అవుననే స‌మాధాన‌మే వినిపిస్తోంది. గుంటూరు-2 ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్య‌వ‌హార శైలి పార్టీ నేత‌ల‌కు అంతుచిక్కడం లేదు. మంత్రులే టార్గెట్గా ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. స్వ‌ప‌క్షంలో ఉంటూనే విప‌క్షంలా ఉండ‌టం మింగుడు ప‌డ‌ని అంశం! త‌న‌పై […]

ఏపీ పాలిటిక్స్‌లో సీన్ రివ‌ర్స్‌

ఏపీలో రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. పార్టీ బ‌లోపేతం కోసం ఏపీ సీఎం చంద్ర‌బాబు నిన్న‌టి వ‌ర‌కు విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేల‌ను వ‌రుస‌పెట్టి సైకిల్ ఎక్కించేసుకున్నారు. దీంతో ఇక్క‌డ టీడీపీ బండి ఓవర్ లోడ్ అయ్యింది. వైసీపీ నుంచి వ‌చ్చిన కొత్త నాయ‌కుల‌కు అప్ప‌టి వ‌ర‌కు టీడీపీలో ఉన్న పాత నాయ‌కుల‌కు మ‌ధ్య కూల్‌వాట‌ర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోంది. దీంతో కొత్త నాయ‌కుల‌తో పొస‌గ‌ని పాత నాయ‌కులు ఇప్పుడు రివ‌ర్స్ జంప్ చేస్తున్నారు. వారంతా టీడీపీకి […]

వార‌సుల ఫ్యూచ‌రే ముఖ్యం….వైసీపీలోకి సీనియ‌ర్లు

ఏపీలో టీడీపీ బండి లోడ్ ఎక్కువైన‌ట్టే క‌నిపిస్తోంది. డీ లిమిటేష‌న్ ఆశ చూపి చంద్ర‌బాబు విప‌క్ష వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్చేసుకున్నారు. డీ లిమిటేష‌న్ జ‌రిగితే ఓకే…లేనిప‌క్షంలో ఇప్పుడు వాళ్ల‌కు టిక్కెట్ల కేటాయింపు చంద్ర‌బాబుకు పెద్ద త‌ల‌పోటే అవుతుంది. దీంతో ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్లంతా రివ‌ర్స్‌గేర్‌లో వైసీపీలోకి వెళుతున్నారు. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో ప్ర‌స్తుతం అదే జ‌రిగింది. వీళ్ల సంగ‌తి ఇలా ఉంటే కొంద‌రు సీనియ‌ర్లు సైతం త‌మ, త‌మ […]

వైసీపీకి ఎంపీ అభ్య‌ర్థులు కావ‌లెను..?

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే టార్గెట్‌గా ముందుకు వెళుతోన్న విప‌క్ష వైసీపీ ప‌రిస్థితి మూడు అడుగులు ముందుకు…ఆరు అడుగులు వెన‌క్కు అన్న చందంగా ఉంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ స‌ల‌హాలు ఫాలో అవుతోన్న జ‌గ‌న్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వ‌ర‌కు కాన్‌సంట్రేష‌న్ చేస్తోన్నా లోక్‌స‌భ నియోజ‌క‌వర్గాల‌ను లైట్ తీసుకుంటున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఎంపీలుగా గెలిచిన నంద్యాల ఎంపీ ఎస్పీవై.రెడ్డి, అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి […]

వైసీపీకి సీనియ‌ర్ నేత‌లు కావ‌లెను?!

ఇప్పుడు ఎక్కువ మంది  ఇలానే ఆలోచిస్తున్నార‌ట‌! రాబోయే రెండేళ్ల‌లో ఏపీలో ఎన్నిక‌లు పెట్టుకుని  ఇప్పుడు వైసీపీ త‌డ‌బ‌డుతోంద‌ని, అధికార టీడీపీని ఎదుర్కొనే స‌త్తా కూడా ఈ పార్టీలో క‌రువ‌వుతోంద‌ని అంటున్నారు. ఈ న‌ప‌థ్యంలోనే సీనియ‌ర్ల కోసం జ‌గ‌న్ ఎదురు చూస్తున్నాడ‌ని అంటున్నారు. అస‌లు ఏం జ‌రుగుతోందో తెలుసుకుందాం.. ఇటీవ‌ల కాలంలో పొలిటిక‌ల్ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఏపీలో అధికార టీడీపీపై వైసీపీ పైచేయి సాధించ‌లేక‌పోతోంది. ముఖ్యంగా అసెంబ్లీలో జ‌గ‌న్ చాంబ‌ర్‌లో వ‌ర్ష‌పునీళ్లు పార‌డంపై పెద్ద ఎత్తున ఉద్య‌మించాల్సిన నేత‌లు […]

బాబు బాణం బాబుకే త‌గిలింది

ఏపీలో పార్టీని సంస్థాగ‌తంగా క‌న్నా నాయ‌కుల‌తో బ‌లోపేతం చేసేయాల‌ని క‌ల‌లు క‌న్న చంద్ర‌బాబు క‌ల‌లు రివ‌ర్స్ అయ్యాయి. ఏపీని అభివృద్ధి చేయ‌డం ద్వారానో లేదా పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేయాల‌నో చూడ‌కుండా చంద్ర‌బాబు విప‌క్ష వైసీపీ వాళ్ల‌ను త‌మ పార్టీలో చేర్చేసుకుంటే ఇక్క‌డ ఎమ్మెల్యేల కౌంట్ పెరిగిపోతుంద‌ని లెక్క‌లు వేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీకి చెందిన ఒక‌రిద్ద‌రు ఎంపీల‌తో పాటు 21 మంది ఎమ్మెల్యేలు, కొంద‌రు ఎమ్మెల్సీలు అధికార పార్టీ చెంత చేరిపోయారు. చంద్ర‌బాబు అనుకున్న‌ట్టు ఇక్క‌డ […]

చెవిరెడ్డి వ్యూహంతో బాబుకు ఉద్యోగులు దూరం!!

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి ఇటీవ‌ల కొన్ని రోజులుగా వ‌రుస‌గా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై రెచ్చిపోతున్నాడు. వైసీపీ ప్ర‌భుత్వం వ‌స్తే.. టీడీపీతో అంట‌కాగి, వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ఇబ్బందులు పెట్టిన వారిని త‌రిమి త‌రిమి కొడ‌తామ‌ని తీవ్ర‌స్థాయిలో హెచ్చ‌రించారు. ఈ విష‌యంలో ఉద్యోగ సంఘాల నేత‌లు బొప్ప‌రాజు వంటి వారు తీవ్రంగానే స్పందించారు. ఈ వ్యాఖ్య‌లు తీవ్రంగా ఉన్నాయ‌ని క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఒక ర‌కంగా వైసీపీ వ్య‌తిరేక ప‌క్షాల‌ను ప్రోత్స‌హించే ప‌త్రిక‌లు సైతం చెవిరెడ్డి […]