చిరంజీవి విశాఖవాసిని అవుతాను అనడం వెనుక ఇంత కథ ఉందా..?

విశాఖ తో మెగాస్టార్ చిరంజీవికి చాలా అనుబంధం ఉంది.సినీ బాక్సాఫీస్ లెక్కల్లో నైజాంలో లాంటి చిరంజీవికి వాల్తేరు సినిమా కూడా గట్టి అడ్డగానే మారిపోతోంది. విశాఖలో మంచి క్రేజ్ ఉందని సినీ ప్రముఖులు సైతం తెలియజేస్తూ ఉంటారు.తాజాగా వాల్తేర్ వీరయ్య ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా చిరంజీవి విశాఖ వేదికపై పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా విశాఖ అంటే ఆయనకు ఎంత ఇష్టమో.. అక్కడ ప్రజలు అంటే ఎంత ప్రేమ ఆయన మాటలలో తెలియజేశారు. […]

విశాఖ వాసులు కూడా రాజ‌ధాని కావాల‌ట‌.. కానీ చిన్న ట్విస్ట్ ఇదే…!

వైసీపీ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానులపై గట్టి ప‌ట్టుద‌ల‌తోనే ఉంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ మూడు సాధిస్తామ‌ని.. వైసీపీ నేత‌లు చెబుతున్నారు. మంత్రులు ఇంకొంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అయితే.. ఈ నేప‌థ్యంలో అస‌లు పాల‌నా రాజ‌ధానిని ఏర్పాటు చేయాల‌ని త‌ల‌పోస్తున్న విశాఖ ప్ర‌జ‌ల మ‌నోగతం ఏంటి? ఇక్క‌డి ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారు? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. దీనిపై ఆన్‌లైన్ మీడియా సంస్థ‌లు వెంట‌నే రంగంలోకి దిగిపోయా యి. ప్ర‌జ‌ల నోటి ముందు మైక్ పెట్టి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాయి. […]

`అఖండ` కోసం వ‌చ్చిన‌ అఘోరాలు..విశాఖ‌లో సంద‌డే సంద‌డి!

న‌ట‌సింహం నంమూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన `అఖండ‌` చిత్రం నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్ పాత్ర‌ను పోషించాడు. జ‌గ‌ప‌తిబాబు, పూర్ణ‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల ఈ మూవీ సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఓవైపు […]

విశాఖలో డెల్టా ప్లస్ వేరియంట్..హడలిపోతున్న ప్ర‌జ‌లు!?

క‌రోనా సెకెండ్ వేవ్‌ ఉధృతి కాస్త త‌గ్గిందో లేదో.. మూడో వేవ్‌ గురించి చ‌ర్చ మొదలైంది. ముఖ్యంగా డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పుడు దేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఈ డెల్టా ప్లస్ వేరియంట్‌ అనేది ఎంతో ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని, మూడ‌వ దశ కోరోనా వ్యాప్తికి దారితీయ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇప్ప‌టికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు బయటపడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ డెల్టా ప్ల‌స్ ఇప్పుడు ఏపీలోని […]

మ‌రో వివాదంలో అడ్డంగా బుక్కైన ప్ర‌దీప్‌..ఏం జ‌రిగిందంటే?

ప్ర‌దీప్ మాచిరాజు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర టాప్ మేల్ యాంక‌ర్‌గా దూసుకుపోతున్న ఈయ‌న ఇటీవ‌లె 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాతో హీరోగా మారి అంద‌రి మ‌న‌సుల‌ను దోచుకున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌దీప్ ఓ వివాదంలో అడ్డంగా బుక్కైయ్యాడు. తాాజాగా ఓ షోలో ప్రదీప్ ఏపీ రాజధాని విశాఖ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ప్ర‌దీప్ పొర‌పాటున అలా అన్నాడో.. లేదా కావాల‌నే అన్నాడో తెలియ‌దు. కానీ, ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఏపీ పరిరక్షణ […]

బ్రేకింగ్ : విశాఖలో భారీ అగ్ని ప్రమాదం..!?

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా విశాఖలో భారీ అగ్ని ప్రమాదం. విశాఖ పట్నం జిల్లాలోని దువ్వాడ సెజ్‌లో నేడు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూజా స్క్రాప్ పరిశ్రమలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అక్కడ స్థానికులు తీవ్ర ఆందోళనకు వ్యక్తం చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే పూజా స్క్రాప్ పరిశ్రమలో ఉన్నటుండి మంటలు వ్యాపించినట్లు అక్కడ యాజమాన్యం వారు చెప్పారు. వెంటనే ఇది తెలుసుకుని అప్రమత్తం అయ్యి అక్కడ ఉన్న వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి […]

గంటాని అడ్డం పెట్టుకుని ఆట మొద‌లెట్టేశారు…

ఏపీలో ఇప్పుడు విశాఖ భూదందా కేసు వాడి వేడి సెగ‌లు పుట్టిస్తోంది. అధికార ప‌క్షంలోనే నేత‌లు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించుకుంటూ.. విప‌క్షం ప‌నిని తామే చేసేసుకుంటున్నారు. విశాఖ‌లో భారీ ఎత్తున భూములు కొల్ల‌గొడుతున్నారంటూ మంత్రి అయ్య‌న్న పాత్రుడే నేరుగా మీడియా మీటింగ్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు, దీనిపై సీఎం చంద్ర‌బాబుకు నేరుగా ఆయ‌న లే ఖ కూడా రాసేశారు. ఇవ‌న్నీ ప‌రిశీలిస్తున్న టీడీపీ మిత్ర ప‌క్షం బీజేపీ.. ముఖ్యంగా బీజేపీ ఏపీ నేత‌లు త‌మ‌కు […]

మ‌హానాడులో లోకేశ్ భ‌జ‌న ఎక్కువైందా…

ఏపీలో అధికార టీడీపీకి మ‌హానాడు పెద్ద పండుగ లాంటిది. టీడీపీ నాయ‌కులంద‌రూ ఒకే చోట మూడు రోజుల పాటు స‌మావేశ‌మై పార్టీ విధివిధానాలు, ఇత‌ర‌త్రా అంశాల‌పై చ‌ర్చించుకుంటారు. టీడీపీ పండుగగా మ‌హానాడును పిలుస్తారు. తాజాగా ఏపీలో అధికారంలో ఉండి, తెలంగాణ‌లో అస్తిత్వం కోసం పోరాడుతోన్న టీడీపీ మ‌హానాడు రెండు రాష్ట్రాల్లోను వేర్వేరుగా నిర్వ‌హించారు. తెలంగాణ‌లో తొలి మ‌హానాడు హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే జ‌ర‌గ‌గా ఏపీలో మ‌హానాడు విశాఖ కేంద్రంగా ఈ రోజు స్టార్ట్ అవుతోంది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత […]

వైసీపీలో కీల‌క వికెట్ డౌన్‌

వ‌రుస క‌ష్టాల‌తో విల‌విల్లాడుతోన్న ఏపీ విప‌క్ష వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్‌కు మ‌రో దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. కీల‌క‌మైన విశాఖ న‌గ‌రానికి ఆనుకునే ఉన్న భీమిలి నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే క‌ర్రి సీతారాం పార్టీకి గుడ్ బై చెప్ప‌పేశారు. గ‌త ఎన్నిక‌ల్లో భీమిలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేసిన సీతారాం జ‌గ‌న్ తీరుతో విసిగిపోయి తాను పార్టీకి గుడ్ బై చెపుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. పార్టీ వీడుతున్న సంద‌ర్భంగా మీడియా స‌మావేశం పెట్టిన ఆయ‌న […]