విద్యార్థుల జీవితాలతో చెలగాటం

ప్రవేశ పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వానికి కత్తిమీద సాము. అలాగే ప్రవేశ పరీక్షల ప్రశ్నా పత్రాలు లీకైతే మళ్ళీ పరీక్ష రాయడం అనేది కష్టసాధ్యం. విద్యార్థి లోకం పోటీ ప్రపంచంలో కొట్టుమిట్టాడుతూ తీవ్రమైన భావోద్వేగాలకు లోనవుతోంది. పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల్ని ఎందర్నో చూస్తున్నాం. ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎంసెట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ అయ్యిందని తెలంగాణ సిఐడి స్పష్టం చేయడంతో ఇంకోసారి ఎంసెట్‌ నిర్వహణ జరుగుతుందనే ప్రచారం కారణంగా విద్యార్థి […]

టీడీపీ, టీఆర్‌ఎస్‌ ఆశలపై కేంద్రం నీళ్ళు

పార్టీ ఫిరాయింపులకు పాల్పడేందుకు తెలంగాణలో టిఆర్‌ఎస్‌, ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి వాడుకున్న అస్త్రం ‘అసెంబ్లీ సీట్ల పెంపు’. ఆకాశంలో మేడలు కట్టేయడంలో ఈ రెండు పార్టీలూ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. 2019 నాటికి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి కాబట్టి, ‘ఈలోగా మా పార్టీలోకి వచ్చెయ్యండి’ అని విపక్ష నేతలకు గాలం వేశాయి టిడిపి, టిఆర్‌ఎస్‌. ఈ మూడు నాలుగేళ్ళు అధికారంలో ఉంటాం, ఆ తర్వాత సీటు గ్యారంటీ అనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిథులు తెలంగాణ, […]

కడియం శ్రీహరికి చెక్‌ పెడ్తారా?

తెలంగాణలో ఎంసెట్‌ వివాదాస్పదమయ్యింది. నీట్‌ పరీక్ష కారణంగా ఎంసెట్‌-1, ఎంసెట్‌-2 రాయాల్సి వచ్చింది మెడిసిన్‌ అభ్యర్థులు. అయితే ఎంసెట్‌-2 లీక్‌ అయ్యిందని సిఐడి విచారణలో తేలింది. దాంతో ఎంసెట్‌-2 ఇంకోసారి నిర్వహించాల్సి వచ్చేలా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఇంకోసారి ఎంసెట్‌ నిర్వహించడం వల్ల తమకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 69 మంది విద్యార్థులు అక్రమంగా ఎంసెట్‌-2లో ర్యాంకులు పొందారు. పేపర్‌ లీకేజీ వెనుక పెద్ద కుట్రే దాగుందని సిఐడి తేల్చింది 50 […]

కార్నర్‌ అయ్యింది హరీష్‌రావే

మల్లన్నసాగర్‌ వ్యతిరేక ఉద్యమంలో మంత్రి హరీష్‌రావు కార్నర్‌ అయ్యారు. ఈ వివాదంలో స్వయంగా ముఖ్యమంత్రి కెసియార్‌ జోక్యం చేసుకోవలసి ఉన్నప్పటికీ ఆయన ఆ పని చేయలేదు. ప్రాజెక్టు నిర్వాసితులతో హరీష్‌రావు ఓ దఫా చర్చలు జరిపి వివాదాన్ని కొంత కొలిక్కి తెచ్చారు. ఇక్కడే టిఆర్‌ఎస్‌ నాయకులంతా హరీష్‌రావుకి సహకరించితే వివాదం ఇంతగా ముదిరేది కాదు. హరీష్‌ని ఒంటరి చేయడం ద్వారా ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యమం ఉధృతమయి ఇందులో ఆయనే ఇరుక్కునేలా మారింది. టిఆర్‌ఎస్‌ మినహా అన్ని రాజకీయ […]

ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ సాయం

ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి తెలంగాణ రాష్ట్రం మద్దతివ్వనుందట. తెలంగాణలోని అధికార పార్టీ అయిన టిఆర్‌ఎస్‌, రాజ్యసభలో ప్రత్యేక హోదా బిల్లు (కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లు)పై ఓటింగ్‌ జరిగితే, అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకుందని సమాచారమ్‌. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెసు అధ్యక్షుడు రఘువీరారెడ్డి విజ్ఞప్తితో టిఆర్‌ఎస్‌ ఎంపీ (రాజ్యసభ సభ్యుడు) కేకే సానుకూలంగా స్పందించారట. ఆంద్రప్రదేశ్‌కి అనుకూలంగా ఓటేస్తామని చెప్పారట. ఈ నెల 22వ తేదీన రాజ్యసభలో ఈ బిల్లుపై ఓటింగ్‌ జరిగే […]

లేచాడు నిద్ర లేచాడు జైపాల్ రెడ్డి

పురాణాల్లో కుంభకర్ణుడిగురించి వినే వుంటారు.ఓ ఆరు నెలలు తిండి తర్వాత 6 నెలలు నిద్ర ఇది ఆయన కార్యాచరణ.సరిగ్గా అలాగే ఉంటుంది తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేతే జైపాల్ రెడ్డి గారి వ్యవహారం కూడా.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు టైంలో కొంచెం హడావిడి చేసిన ఈయన ఆ తరువాత కనపడలేదు.ఇన్నాళ్లకు మళ్ళీ మెలుకున్నట్లు కనిపిస్తోంది. లేవడంతోనే ఏకంగా కేసీర్ పైన తెరాస ప్రభుత్వం పైనా విమర్శల వర్షం కురిపించేసారు.కేసీర్ పచ్చి అవకాశవాది అని ధ్వజమెత్తారు.అంతేనా కాంగ్రెస్ […]

కెసిఆర్ మంత్రివర్గంలోకి డికె అరుణ!

అధికార టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతంగా కొనసాగుతుంది. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీయడంలో విజయం సాదించిన గులాబీ దళం ఇపుడు తన దృష్టిని పాలమూర్ జిల్లా వైపు మళ్లించింది. పార్టీ యువ నేతలు కెటిఆర్, హరీశ్‌రావులు పోటాపోటీగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. నల్గొండ ఆపరేషన్‌కు మంత్రి హరీశ్‌రావు సారథ్యం వహిస్తే పాలమూర్ ఆపరేషన్‌కు యువనేత సిఎం తనయుడు కెటిఆర్ సారథ్యం వహిస్తున్నారు. నేరుగా రంగంలోకి దిగిన కెటిఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ […]

మల్లన్నపై కేసీఆర్‌ మొండి వైఖరి ఎందుకట!!

మల్లన్న సాగర్‌ రోజురోజుకీ వివాదాస్పదమవుతోంది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్‌ కారణంగా పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్లు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న వేళ, ఇప్పటికీ ఈ వివాదంపై కెసియార్‌ సర్కార్‌ స్పందన ఏమాత్రం సబబుగా లేదు. ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోమని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుంటే, వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించాల్సింది పోయి, తామే పెద్ద నిర్వాసితులమని తన తల్లిదండ్రులకు ఆ బాధ ఏంటో తెలుసని మంత్రి కెటియార్‌ చెప్పడం శోచనీయం. కెసియార్‌ ప్రాజెక్టు నిర్వాసితుడో […]

గూడు కోసం ఎదురుచూపులు

పేద ప్రజలకు ఓ గూడు కల్పంచాలనే లక్ష్యంతో కేసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం పధకాన్ని మొదలు పెట్టింది.అందులో భాగంగా మొదటి విడతలో సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో 400 ఇళ్ళ నిర్మాణం చేసి… పేద ప్రజలకు అందించారు. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఈ ఏడాదిలో లక్ష ఇళ్ళ నిర్మాంచాలని … ప్రభుత్వం భావించింది.ఒక్కో ఇంటిపై ఏడున్నర లక్షలు ఖర్చు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. అంటే ఒక్కో […]