ఖమ్మం కాంగ్రెస్ లో వార్

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం ప్రత్యేకం.. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటే ఖమ్మం జిల్లా మాత్రం కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతోంది. తెలుగుదేశం పార్టీకి కూడా ఆ జిల్లాలో మంచి ఓటు బ్యాంకు ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికి బట్టకడుతోందంటే ఖమ్మం జిల్లా వల్లే అని చెప్పవచ్చు. అయితే ఇపుడు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు రాజ్యమేలుతున్నాయి. నువ్వా.. నేనా అంటూ రెండు గ్రూపులు పోటీ పడుతుండంతో కార్యకర్తలు, కిందిస్థాయి నాయకులు […]

తలపట్టుకుంటున్న రేవంత్

తెలుగుదేశం పార్టీలో ఉండి.. చంద్రబాబు అనుచరుడిగా ఎదిగి.. ఆ తరువాత ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి.. తన వాగ్ధాటితో రాహుల్ గాంధీని మెప్పించి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డికి పార్టీలో ఇంకా ఫుల్ సపోర్టు లభించలేదు. సరికదా నాయకులు కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు పెడుతున్నారు. అయినా సరే.. రేవంత్ అందరినీ కలుపుకొని పోతూ పార్టీని ముందుకు లాగుతున్నాడు. సభలు, సమావేశాలు, మీడియా మీటింగ్స్ నిర్వహిస్తూ కేసీఆర్ ను విమర్శిస్తున్నాడు. […]

ఆ రెండు యూనియన్లే కీలకం అంతే..

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల యూనియన్లు అనేకమున్నాయి. తమ సమస్యల పరిష్కారానికి అన్ని సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి. అయితే ప్రభుత్వంతో చర్చలు జరిపే సమయోం మాత్రం కేవలం రెండే రెండు యూనియన్ల పేర్లు బయటకు వస్తాయి. సర్కారు కూడా వారితోనే చర్చలు జరుపుతుంది. మరే సంఘంతోనూ చర్చలు జరిపినట్లు కనిపించడం లేదు. ఆ రెండు సంఘాలు ఏవంటే.. ఒకటి టీజీఓ (తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్), మరొకటి టీఎన్జీఓ (తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్). ఉద్యగులకు […]

కారెక్కనున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే?

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అస్మదీయులు.. తస్మదీయులుగా మారవచ్చు.. తస్మదీయులు అస్మదీయులుగా మారవచ్చు. ఎందుకంటే అది కూడా ఓ ఆటలాంటిదే. ఐపీఎల్ కూ, పాలిటిక్స్ కూ పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోఉంటారో తెలియదు. ఐపీఎల్ లో కూడా ఏ ప్లేయర్ ఏ టీమ్ లోఉంటాడో అర్థం కాదు. ఇపుడు తెలంగాణలో మరో పుకారు షికారు చేస్తోంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం ప్రగతి భవన్ లో […]

కారు పార్టీలో ‘స్మార్ట్‘ భయం!

ల్యాండ్ ఫోన్.. బేసిక్ ఫోన్ ఉన్నపుడే అందరూ ప్రశాంతంగా ఉండేవాళ్లు..ఒక్కరి విషయాలు ఒకరికి మాట్లాడితే తప్ప తెలిసేది కాదు.. కానీ స్మార్ట్ ఫోన్ వచ్చిన తరువాత ఆ పరిస్థితి లేదు.. ప్రైవసీ అసలే లేదు.. స్మార్ట్ ఫోన్ మన మనసుల్లోకి తొంగి చూస్తోంది.. ఎప్పుడేం మాట్లాడినా కనిపెట్టేస్తోంది..కనిపెట్టడమే కాదు ఇతరుల చెవుల్లోకి దూరిపోతోంది.. అందుకే స్మార్ట్ ఫోన్ లో మాట్లాడాలంటేనే భయం.. పర్సనల్ విషయాలు అస్సలు మాట్లాడే పరిస్తితి లేదు.. ఎందుకంటే రికార్డింగ్ సౌకర్యం అందులో ఉండటంతో […]

ఎన్నికల తరవాత పదవుల జాతర

కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. ఇంకాఉన్నది కేవలం 18 నెలలే.. దీంతో పదవులు దక్కని నాయకులు పార్టీలో కేసీఆర్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ పదవులొద్దు.. నామినేటెడ్ పోస్టులివ్వాలని కోరుతున్నారు. దీంతో బాసు.. నామినేటడ్ పోస్టుల భర్తీపై ద్రుష్టి సారించారట. ఈనెలల జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారని సమాచారం. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందే ఈ కసరత్తు మొదలైనట్లు తెలిసింది. టీఎస్ఆర్టీసీతోపాటు బీసీ […]

డిపాజిట్లే రాలేదు.. అధికారం సాధ్యమా?

తెలంగాణలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే మాట పదే పదే మీడియాతోపాటు సభలు, సమావేశాల్లో చెబుతున్నారు. ఇంకా ముందుకు వెళ్లి హైకమాండ్‌తో కూడా ఇవే ముచ్చట్లు చెబుతున్నారు. ముగ్గురు ఎమ్మెల్యే సీట్లు, నాలుగు ఎంపీ సీట్లు, జీహెచ్‌ఎంసీలో 48 కార్పొరేటర్ల సీట్లను గెలుచుకుంది. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను కాదని మనపార్టీ సభ్యులు విజయం సాధించారు. భవిష్యత్తులో ఇంకా కష్టపడితే అధికార పీఠంపై కూర్చోవచ్చు అనేది స్థానిక బండి […]

తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ విత్‌ పీకే పాలిటిక్స్

తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికార పీఠంపై కేసీఆర్‌.. ముచ్చటగా మూడోసారి కూడా ప్రగతి భవన్‌ నుంచి చక్రం తిప్పాలని కారు పార్టీ అధినేత భావిస్తున్నారు..ఎన్నికలకు ఉన్నది కేవలం 18 నెలలే.. ప్రభుత్వ వ్యతిరేకత మొదలైందేమోనన్న అనుమానం అధినేతను వేధిస్తోంది.దీనికి తోడు పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరి హుజూరాబాద్‌లో విజయం సాధించారు. అంతకుముందు దుబ్బాక, ఇపుడు హుజూరాబాద్‌ ఎన్నికల్లో కమలం అభ్యర్థులు గెలిచారు. బీజేపీ రాష్ట్రంలో వాయిస్‌పెంచుతోంది. ముఖ్యంగా వరి కొనుగోలు వ్యవహారంలో […]

సరే అనలేక.. సారీ అనలేక…

తెలంగాణ ముఖ్యమం‍త్రి, టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌కు ఇపుడు పెద్ద చిక్కొచ్చి పడింది. విద్యత్‌ చార్జీలు, బస్సు చార్జీల పెంపు వ్యవహారం కేసీఆర్‌ టేబుల్‌ మీదకు వచ్చింది. రాష్ట్రంలో అనేక రోజులుగా ఆర్టీసీ బస్సు చార్జీలు, విద్యుత్‌ చార్జీలు పెంచలేదు. దీంతో ఆయా సంస్థలు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. చార్జీలు పెంచకపోతే సంస్థల మనుగడ కష్టమవుతుందని ఇప్పటికే అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై కేసీఆర్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బస్సు, విద్యుత్‌ చార్జీలు పెంచేవిషయంలో సీఎం […]