ఏపీ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు కంటిపై కునుకులేకుండా పోతోందట. ఫుల్లు ఏసీలోనూ ముచ్చెమటలు పడుతున్నాయట! దీనికి కారణం.. ఓ రెండు విషయాలని అధికారులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి సీఎం సీటును పదిలం చేసుకోవాలని భావిస్తున్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధానంగా రెండు విషయాలను ఎంచుకున్నారు. ఎక్కడ ఏ సభలో మాట్లాడినా ఆరెండు విషయాలు చెప్పకుండా ఆయన ఉండలేకపోతున్నారు. దీంతో ఆ రెండు విషయాలే ఇప్పుడు ఆయనకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయట. ఇంతకీ […]
Tag: TDP
నారా బ్రాహ్మణిపై వైసీపీ అభ్యర్థి ఖరారే..!
ఏపీ సీఎం చంద్రబాబు కోడలు, హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలయ్య బాబు కుమార్తె బ్రాహ్మణి రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే కొన్ని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది? అనేది కూడా లీకైపోయింది. బ్రాహ్మణిని లోక్ సభ కు పంపాలని బాబు గత కొన్నాళ్ల కిందటే డిసైడయ్యారు. దీంతో ఆమెను గుంటూరు నుంచి ఎంపీగా పంపితే బాగుంటుందని నిర్ణయించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా […]
ఈ టీడీపీ సిట్టింగ్ ఎంపీలకు 2019లో సారి
ఏపీ సీఎం చంద్రబాబు ఈ సారి టిక్కెట్ల విషయంలో కాస్త కటువుగానే వ్యహరిస్తారా ? వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి వరుసగా ఏపీకి రెండో సీఎం అయ్యేందుకు సర్వశక్తులు ఒడ్డుతోన్న బాబు చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను పక్కన పెట్టేయనున్నారా ? అంటే తాజా రాజకీయ పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్లలో గత ఎన్నికల్లో బీజేపీకి 4 సీట్లు ఇవ్వగా 21 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. వచ్చే ఎన్నికల్లో […]
నంద్యాలలో కాంగ్రెస్ టార్గెట్ ఎవరు?
విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ అస్తిత్వం కోసం పోరాడుతోంది. సరైన సమయంలో ఉనికి చాటాలని ప్రయత్నిస్తోంది. వీలైనంత వరకూ పోటీలో నిలిచి అధికార, ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయాలని చూస్తోంది! ఇప్పుడు ఆ సమయం వచ్చిందని భావిస్తోంది. నంద్యాల ఎన్నికలను సరైన వేదికగా చేసుకోవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం నంద్యాలలో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ బరిలోనే నిలుస్తుండగా.. ఇప్పుడు పోటీలో మేము కూడా ఉన్నామని ప్రకటించింది. ఇదే ఇప్పుడు వైసీపీ, టీడీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. కాంగ్రెస్ గెలవకపోయినా.. […]
పాలకొల్లు మరో గరగపర్రు అవుతోందా..!
పశ్చిమగోదావరి జిల్లాలోని గరగపర్రు ప్రస్తుతం అట్టుడుకుతోంది. అక్కడ దళితవర్గాలకు చెందిన వారిని వెలివేశారన్న వార్తలతో ఆ గ్రామం పేరు ఇప్పుడు మీడియాలో మార్మోగుతోంది. గరగపర్రులో దళితులంతా ఉద్యమిస్తుంటే ఇప్పుడు అదే జిల్లాలోని పాలకొల్లు కేంద్రంగా బీసీలంతా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు యాంటీగా ఒక్కటవుతున్నారు. నియోజకవర్గంలో కొద్ది రోజులుగా జరుగుతోన్న పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని బీసీలతో పాటు కోనసీమలో బలహీనవర్గాల్లో బలమైన ఓ ప్రధాన సామాజికవర్గం మొత్తం నిమ్మలకు వ్యతిరేకంగా గళమెత్తుతోంది. నిమ్మల పాలకొల్లు నియోజకవర్గంలో […]
టీడీపీలో సస్పెన్షన్ల పరంపర..మరి ఆ ఇద్దరి ఎంపీల సంగతేంటో..?
ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఈ సస్పెన్షన్ల పర్వానికి బ్రేక్ ఎప్పుడు పడుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ జాబితాలో చట్టసభల్లో ఉన్న ఎమ్మెల్యేల నుంచి కౌన్సెలర్ల వరకు ఉంటున్నారు. వీరికి తోడు ఇప్పుడు ఏకంగా ఒకరిద్దరు ఎంపీలు సైతం పార్టీనే ధిక్కరిస్తున్నారు. వారి పేర్లు సైతం సస్పెన్షన్ జాబితాలో ఉన్నా వారిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకునేందుకు సాహసించలేని పరిస్థితి. టీడీపీ సస్పెన్షన్ల పరంపరలో మరో నాయకుడు ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ […]
ఇద్దరు చంద్రుల షేక్ హ్యాండ్ అందుకేనా?
ఏపీ, తెలంగాణ సీఎంలు కేసీఆర్, చంద్రబాబుల వైఖరే డిఫరెంటు. ఈ ఇద్దరూ అవసరాన్ని బట్టి తిట్టుకోవడం, అవసరాన్ని బట్టి పొగుడుకోవడం పరిపాటైంది. నిన్న మొన్నటి వరకు కృష్ణా వాటర్ విషయంలో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరించిన ఈ ఇద్దరు ఇప్పుడు ఢిల్లీలో జరిగిన రాష్ట్రపతి నామినేష్ ఘట్టానికి వెళ్లిన సందర్భంలో మాత్రం చిరునవ్వులు చిందుకుని, షేక్ హ్యాండులు ఇచ్చేసుకుని మీడియాకు ఫోజులిచ్చారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి చుట్టూతానే పాలిటిక్స్ రింగులు కొడుతున్నాయి. ఎవరికివారే సొంత లాభం లేకుండా […]
అమరావతి పూలింగ్పై ప్రపంచ బ్యాంకు తనిఖీలు!
సీఎం చంద్రబాబు అమరావతి కలలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. ఏ ముహూర్తాన ఆయన అమరావతికి ప్లేస్ డిసైడ్ చేసుకున్నాడో.. అప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాడు. తాజాగా ఆయన అమరావతి కోసం చేసిన ల్యాండ్ పూలింగ్పై ప్రపంచ బ్యాంకు తనిఖీ కొరడా ఝళిపిస్తోంది. బాబు చేసిన ల్యాండ్ పూలింగ్తో తాము నష్టపోయామని పేర్కొంటూ రాజధాని ప్రాంత రైతులు ఇప్పటికే ప్రపంచ బ్యాంకుకు లేఖ రాశారు. మొదట్లో బ్యాంకు అధికారులు ఇది మామూలే కదా అనుకున్నా.. లేఖల పరంపర […]
నంద్యాల ఓటర్లకు టీడీపీ బంపర్ ఆఫర్
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ.. ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి. ముఖ్యంగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నేతలు ప్రచారం ప్రారంభించేశారు. ఇంకా ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభం కాకముందే.. వాగ్థానాలు జోరందుకున్నాయి. పట్టణ ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ కేబుల్ కనెక్షన్ ఫ్రీ అంటూ ప్రకటించడం.. దీనికి కౌంటర్గా వైసీపీ కూడా బదులివ్వడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇంకా ఎన్నికల ప్రచారానికి ఈసీ నోటిఫికేషన్ ఇవ్వకముందే.. ఇలా హామీలు గుప్పిస్తుంటే.. […]