ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో జిల్లా రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. అసలు ఏ క్షణానికి అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణిరెడ్డి ఈ రోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. వైసీపీలో చేరేందుకు సిద్ధమైన శిల్పా చక్రపాణి రెడ్డికి వైసీపీ అధినేత జగన్ షాక్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత వైసీపీలో చేరాలంటూ వైసీపీ […]
Tag: TDP
కథ-స్క్రీన్ప్లే, దర్శకత్వం: చంద్రబాబు
హెడ్డింగ్ వినడానికి షాకింగ్గా అనిపించినా.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇదే జరుగుతోంది. `అక్టోబర్ నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటా` అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన నాటి నుంచి ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్ను లక్ష్యంగా చేసుకునే పవన్ దీనిని ప్రకటించాడా? అనే సందేహం కలగకమానదు. `అన్న వస్తున్నాడు` పేరుతో జగన్.. అక్టోబర్ నుంచే పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కూడా రంగంలోకి దిగుతుండటం.. అది కూడా […]
నంద్యాలలో టీడీపీ అల్లుడు వర్సెస్ వైసీపీ మామ
ఏపీలో ఇప్పటికే హైటెన్షన్గా మారిన కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ట్విస్టులు అదిరిపోతున్నాయి. గత వారం రోజులుగా నలుగురు కీలక వ్యక్తులు ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి జంప్ చేయడం, ఇక్కడ ఇటీవల కాలంలోనే సీఎం చంద్రబాబు రెండుసార్లు పర్యటించడం, ఇక ఇక్కడ ప్రచారానికి వైసీపీ అధినేత జగన్, షర్మిల, విజయలక్ష్మితో పాటు టీడీపీ నుంచి బ్రాహ్మణి లాంటి వాళ్లు ప్రచారానికి వస్తుండడంతో ఇప్పటికే ఇక్కడ రాజకీయం అదిరిపోతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇక్కడ […]
2019 క్లారిటీ: ఎన్టీఆర్+పవన్+లోకేశ్ ఒకవైపు జగన్ ఒక వైపు
2019 ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోను హీటెక్కిస్తున్నాయి. ఈ హీట్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా ఉంది. ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మారడం ఖాయంగా కనిపిస్తోంది. నేడు మిత్రపక్షాలుగా ఉన్నవాళ్లు ఎన్నికల వేళ శత్రువులు అవుతారన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇదిలా ఉంటే ఏపీలో బీజేపీ+టీడీపీ పొత్తు బ్రేకప్ అవుతుందన్న వార్తల నేపథ్యంలో బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. […]
ప్రభుత్వం ఆలోచించింది ఒకటైతే.. జరిగిన ప్రచారం మరొకటి
ఒకే ఒక్క వార్త మూడేళ్ల కష్టాన్ని వృథా చేసింది. ఇన్నాళ్లూ జాగ్రత్తగా చూసుకుంటున్న ఉద్యోగులను దూరం చేసేసింది. సీఎం చంద్రబాబు కష్టాన్నంతా బూడిదలో పోసిన పన్నీరు చేసింది. అది వాస్తవమో అవాస్తవమో తెలీదు గాని.. ఉద్యోగుల్లో మాత్రం ప్రభుత్వంపై అభద్రతా భావాన్ని కలిగించేలా చేసింది. `నేను గతంలోలా కఠినంగా వ్యవహరించను. నేను మారాను. నన్ను నమ్మండి` అంటూ 2014 ఎన్నికల సమయంలో ఉద్యోగులకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. అలా వ్యవహరిస్తున్నా.. ఒకే ఒక్క కథనంతో మొత్తం సీన్ […]
ఏపీ మంత్రి కేసీఆర్కు ప్రశంసలు…ఇంకేముంది
రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత.. తెలంగాణలో టీఆర్ఎస్ ధాటికి తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయింది. దీనిపై అటు తెలంగాణ నేతలు.. సీఎం కేసీఆర్పై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ సమయంలో కేసీఆర్ను ప్రశంసిస్తూ ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ నేతలను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీకి వైసీపీ కంటే తక్కువ ఓట్లు వస్తాయని చెప్పిన కేసీఆర్ను పొగడటంపై మండిపడుతున్నారు. ఒకపక్క తెలంగాణలో తామంతా కేసీఆర్ అవినీతి, ఇతర […]
ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా ఆయనే !
ఏపీలో అధికార టీడీపీ అటు ప్రభుత్వ పరంగాను, ఇటు రాజకీయంగాను అష్టకష్టాలు పడుతోంది. బీజేపీ నుంచి సరైన సహకారం లేకపోవడం, నియోజకవర్గాల పునర్విభజన లేకపోవడం, నిధుల లేమితో ఆశించిన మేర హామీలు నెరవేర్చలేకపోవడం, పార్టీలో ఎప్పుడూ లేనంతగా గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడంతో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తోన్న చంద్రబాబు పార్టీ సంస్థాగత కమిటీల పరంగా ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా […]
షాక్: వైసీపీలోకి 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు…!
ఏపీలో అధికార టీడీపీ ఈ మూడేళ్లలో రాజకీయంగా సాధించింది ఏంటంటే అది ఒకే ఒక్కటి… విపక్ష వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం. చంద్రబాబు అభివృద్ధి ద్వారా బలోపేతం అవ్వాలన్న విషయాన్ని పక్కన పెట్టేసి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుని పార్టీని బలోపేతం చేయాలనే ప్రయత్నానికి తెరదీశారు. వైసీపీని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు చంద్రబాబు వేసిన ఈ ఎత్తులు ఇప్పుడు బాబుకే పెద్ద ముప్పు కాబోతున్నాయి. ఏపీ టీడీపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు […]
టీడీపీ మీడియా పిచ్చి ముదిరిందా
ఎక్కడయినా.. ఎప్పుడయినా సమయం, సందర్భం, ఔచిత్యం.. పాటించి ప్రవర్తించాలి. లేకపోతే అభాసుపాలవ్వక తప్పదు. ఇప్పుడ జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు భేటీని కూడా తమకు అనుకూలంగా మలుచుకుని.. టీడీపీ అనుకూల మీడియా మరోసారి చర్చనీయాంశమైంది. ఉద్దానంలోని కిడ్నీ బాధితులు పడుతున్న ఇబ్బందులు, వాటిపై అధ్యయనం చేసిన హార్వర్డ్ వర్సిటీ ప్రతినిధులు అందజేసిన నివేదికను చంద్రబాబుకు అంద జేసేందుకు పవన్ వెళ్లారనేది అందరికీ తెలిసిందే! కానీ ఈ విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టించి.. రాష్ట్రం గురించి […]