దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్నది. వైరస్ సుడిగాలిలా చుట్టేస్తున్నది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ భయంకరంగా పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, కొత్తగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 52,726 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో రోజువారీ కేసులు వెయ్యి దాటగా, కొత్తగా.. 1,005 కరోనా […]
Tag: Politics
పురపోరుపై తెలంగాణ ఎస్ఈసీ సంచలన నిర్ణయం..
కరోనా వైరస్ పంజా విసురుతోంది. విలయతాండవం చేస్తున్నది. సుడిగాలిలా వ్యాపిస్తూ వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నది. దీంతో అడుగు బయటపెట్టాలంటేనే జనం జంకుతున్నది. ఈ మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సైతం వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. నైట్కర్ఫ్యూ అమలు చేస్తున్నది. అయినప్పటికీ అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం యథాతధంగా నిర్వహించనున్న ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 30న […]
కరోనాతో బీజేపీ సీనియర్ నేత మృతి..!
కాషాయదళంలో కరోనా మహమ్మారి కల్లోలం రేపుతున్నది. ఇప్పటికే పలువురు సీనియర్, జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు సైతం వైరస్ బారిన పడ్డారు. అందులో కొందరు కోలుకోగా, మరికొందరు ప్రాణాలను విడిచారు. ఇప్పుడు తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి భవర్ లాల్ వర్మ శనివారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా బారిన పడి ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చేరారు. […]
బాలయ్య ఎమ్మెల్యేగా గ్రాఫ్ ఎలా వుంది..2019లో గెలుస్తాడా?
తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపూర్ వజ్రపుకోట. పార్టీ పెట్టిన ఈ మూడున్నర దశాబ్దాల్లో ఇక్కడ పార్టీ ఒక్కసారిగా కూడా ఓడిపోలేదు. కర్ణాటకకు సరిహద్దుల్లో ఉండే ఈ నియోజకవర్గంలో హిందూపూర్ పురపాలక సంఘంతో పాటు మండలం, చిలమత్తూరు, లేపాక్షి మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2.16 లక్షలు. ఇక్కడ మైనార్టీలు, బీసీల ప్రాబల్యం ఎక్కువ. 1952లో ఆవిర్భవించిన ఈ నియోజకవర్గ రాజకీయం గురించి మాట్లాడుకోవాలంటే టీడీపీ ఆవిర్భావానికి ముందు […]
ఎన్టీఆర్ వేదాంతంలో బాబు టార్గెట్
జూనియర్ ఎన్టీఆర్.. సినిమాల్లో తనకంటూ సొంత ప్లాట్ ఫాం ఏర్పాటు చేసుకున్న నందమూరి వంశాంకురం. తన అద్భుతమైన నటనతో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులను సొంతం చేసుకున్న తారక్.. తాజాగా జై లవకుశ పేరుతో బ్లాక్ బ్లస్టర్ మూవీ అందించేందుకు రెడీ అయ్యాడు. గురువారం విడుదల కానుక్క ఈ మూవీకి సంబంధించి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక, ఈ మూవీ సొంత బ్యానర్పై తీయడంతో నందమూరి కుటుంబం కూడా భారీ […]
‘ జై లవకుశ ‘ లో పాలిటిక్స్పై ఎన్టీఆర్ కామెంట్
టాలీవుడ్ యంగ్టైగర్ ఎన్టీఆర్ ఏం చేసినా, ఏం మాట్లాడినా అది కేవలం సినిమాలకు మాత్రమే వర్తించదు. ఎన్టీఆర్ డైలాగులపై కేవలం సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ కోణంలో కూడా చర్చకు వస్తుంటాయి. అలాగే ఎన్టీఆర్ సినిమాల్లో డైలాగులపై కూడా రాజకీయ కోణంలో చాలా సార్లు చర్చలకు వస్తుంటాయి. ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించిన బలమైన నందమూరి ఫ్యామిలీ నుంచి రావడంతో సహజంగానే ఆయన్ను సినిమా కోణంలోనే కాకుండా రాజకీయ కోణంలో కూడా చూస్తుంటాం. ఈ క్రమంలోనే […]
సొంత నియోజకవర్గాలు వద్దు…. పక్క నియోజకవర్గాలే ముద్దు..!
2019 ఎన్నికలకు ఇంకా యేడాదిన్నర టైం ఉంది కదా ? అని చూస్తూ కూర్చునే పరిస్థితి లేదు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా ముంచుకొచ్చే సంకేతాలు వస్తున్నాయి. కేంద్రంలో మోడీ ముందస్తుగా కాలు దువ్వుతుండడంతో ఇక్కడ తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ముందస్తుకే మొగ్గు చూపుతున్నారు. మరో టాక్ ఏంటంటే 2018 చివర్లోనే ఎన్నికలు ఉన్నా ఉండొచ్చు. దీంతో నాయకుల ఆలోచనలు కుదురుగా ఉండడం లేదు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేయాలి.. మళ్లీ తామే గెలిచేయాలన్న కోరిక వారి […]
లగడపాటి టీడీపీ ఎంట్రీ..ఆ ఇద్దరిలో ఎవరికి ఎర్త్..!
ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ పేరు మళ్లీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఆయన.. ఆ మాటకు ఇన్నాళ్లూ కట్టుబడి ఉన్నారు. అయితే మళ్లీ ఆయన రాజకీయా ల్లోకి రావాలనే ఒత్తిడి ఇప్పుడు విపరీతంగా పెరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ, ఇతర రాజకీయ పరిణామాల తరుణంలో.. ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరితే.. ఎవరికి ఎర్త్ పెడతారు అనే […]
వాళ్లని దించాలి.. వీళ్లని ఎత్తాలి.. జగన్కు జేజేలు అప్పుడే!!
అవును! జగన్ మారితేనో లేదా ఆయన వ్యూహం మార్చుకుంటేనో తప్ప ఏపీలో ప్రధాన విపక్షంగా ఉన్న వైసీపీకి మనుగడ ఉండదని అంటున్నారు విశ్లేషకులు. 2019లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి వచ్చి తీరాలని గట్టి పట్టుమీదున్న వైసీపీ అధినేత జగన్.. దానికి అనుగుణంగా తన తీరును, పార్టీ నడవడికను మార్చి తీరాలని చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీలో అంతా తానై వ్యవహరిస్తున్న ప్రస్తుత విధానానికి తక్షణమే ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా సూచిస్తున్నారు. నిజానికి జగన్ 2014లోనే అధికారంలోకి రావాల్సి […]