నంద్యాలలో యాక్టివ్ పాలిటిక్స్లో చురుగ్గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి ఇప్పడు అత్యంత కీలకమైన సమయంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనంతట ఆయనే టీడీపీకి దూరమయ్యారా? లేక పార్టీ అధినేత చంద్రబాబే ఆయనను కావాలని పక్కన పెట్టేశారా? అంటే పక్కన పెట్టేశారనే అంటున్నారు స్థానిక తెలుగు తమ్ముళ్లు. దీనికి సుబ్బారెడ్డి స్వయంకృతమే కారణంగా చెబుతున్నారు. విషయంలోకి వెళ్తే.. ఏవీ సుబ్బారెడ్డికి ప్రస్తుతం ఉప ఎన్నికల బరిలో నిలిచిన భూమా వర్గానికి బంధుత్వం ఉంది. వీరంతా గతంలో టీడీపీలోనే ఉండేవారు. […]
Tag: Nandyala
నంద్యాలలో వైసీపీకి షాక్…. టీడీపీకి దిమ్మతిరిగే షాక్
నంద్యాల ఉప ఎన్నిక వేళ అధికార టీడీపీ, విపక్ష వైసీపీ ఎత్తులు, పై ఎత్తులతో హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో విమర్శలు, ప్రతి విమర్శలతో దూసుకుపోతోన్న ఈ రెండు పార్టీలు ఈ రోజు పెద్ద సంచలనానికి తెరలేపాయి. ముందుగా టీడీపీ వైసీపీని దెబ్బకొట్టేందుకు ఓ ప్లాన్ వేసింది. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న శిల్పా మోహన్రెడ్డి నామినేషన్ చెల్లదంటూ ఓ కొత్త వాదన తెరమీదకు తెచ్చారు. టీడీపీ లీగల్ సెల్ వాళ్లు శిల్పా నామినేషన్ నోటరీ […]
నంద్యాలలో జగన్ గట్టి దెబ్బ తగలనుందా..!
తాము గెలవలేమని తెలిసినా.. పోటీ ప్రధానంగా టీడీపీ,వైసీపీ మధ్య అని రాజకీయ వర్గాలన్నీ కోడై కూస్తున్నా ఇవేమీ పట్టించుకోకుండా నంద్యాల ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ తమ అభ్యర్థిని నిలబెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే గాక మైనారిటీ వర్గానికి చెందిన అబ్దుల్ ఖాదిర్ను తమ అభ్యర్థిని ప్రకటించింది. ఏ నమ్మకం మీద ఉప ఎన్నిక బరిలోకి దిగింది? మైనారిటీ అభ్యర్థినే బరిలోకి దించడం వెనుక రాజకీయంగా ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. […]
నంద్యాల ప్రచారానికి బ్రాహ్మణి…తెర వెనక కథేంది
నంద్యాల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఏకంగా 25 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్.. ఇలా మొత్తం యంత్రాంగమంతా నంద్యాలలోనే మకాం వేశారు. ఈ ఎన్నికను భూమా నాగిరెడ్డి కూతురు, మంత్రి అఖిలప్రియ చాలెంజింగ్గా తీసుకున్నారు. తన అన్న గెలవకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించేశారు. అయితే ఇప్పుడు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్రతిపాద నను సీఎం చంద్రబాబు ముందుంచారట. అదేంటంటే.. సీఎం కోడలు, […]
ఉలిక్కిపడ్డ పార్టీ … టెన్షన్ లో నాయకులు
రాష్ట్ర విభజనతో ఏపీలో పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్.. ఉనికి కోసం తీవ్రంగా పోరాడుతోంది. పార్టీకి వీర విధేయులైన నాయకులు.. అంతోఇంతో క్యాడర్ తప్ప ఎవరూ కనిపించడం లేదు. ఉన్న వారితోనే నెట్టుకొస్తున్న కాంగ్రెస్.. నంద్యాల ఉప ఎన్నికల బరిలో దిగుతామని ప్రకటించినా అంతగా ఎవరూ పట్టించుకోలేదు. ప్రకటన అయితే చేసేసింది కానీ ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది. ఎంతో కష్టపడి.. భూతద్ధంలో వెతికి.. నేను పోటీచేయను అన్నా బుజ్జగించి మరీ ఒక అభ్యర్థిని బరిలో నిలబెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ […]
పవన్ ప్రభావం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే!!
నంద్యాల ఉప ఎన్నిక సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. 2019 ఎన్నికలకు రిఫరెండంగా అటు టీడీపీ, ఇటు వైసీపీ ఈ ఎన్నికను భావిస్తున్నాయి. ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు, ఇటు ఆయన తనయుడు లోకేష్ నంద్యాలలో ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. అన్ని వర్గాలు తమకు మద్దతు ఇస్తాయని భావించిన టీడీపీ ఆశలు.. వైసీపీ నిర్వహిం చిన ఒక్క సభతో చెల్లాచెదురైపోయాయి. ఇక మంత్రులు, నాయకుల వల్ల కాదని టీడీపీ అధినేత చంద్ర బాబుకు అనుభవంలోకి వచ్చింది. అందుకే […]
20 రోజులు జగన్ ఫ్యామిలీ అడ్రస్ చేంజ్
కర్నూలు జిల్లా నంద్యాలలో వైసీపీ క్రమక్రమంగా పట్టు బిగిస్తోంది. గత వారం రోజులుగా ఇక్కడ ఎవరో ఒకరు ప్రముక వ్యక్తి వైసీపీలో చేరుతూనే ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ రాకేశ్రెడ్డి, టీడీపీ కార్పొరేటర్ హనీఫ్, నిన్న తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలోకి జంప్ చేసేస్తున్నారు. ఇక్కడ ఎన్నిక 2019 సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్గా అందరూ భావిస్తుండడంతో జగన్ కూడా ఇక్కడ చావో రేవో తేల్చుకునేందుకు రెడీగానే ఉన్నాడు. ఈ క్రమంలోనే […]
నంద్యాలలో పవన్ ఎన్ని ఓట్లను ప్రభావితం చేస్తాడు…!
`నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై రెండు రోజుల్లో అభిప్రాయాన్ని ప్రకటిస్తా` అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన నాటి నుంచి అందరిలోనూ ఒకటే చర్చ! పవన్ ఎన్ని ఓట్లు ప్రభావితం చేస్తాడు? ఏఏ వర్గాల ఓట్లను తనవైపు తిప్పుకోగలుగుతాడు? ఎవరికి ఇది ప్లస్? ఎవరికి మైనస్? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. పవన్ నిర్ణయంపై అటు టీడీపీ, వైసీపీతో పాటు జనసేన కార్యకర్తలు కూడా ఉత్కంఠతో […]
నంద్యాలలో ప్రజెంట్ ట్రెండ్ ఏంటి?
కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నిక రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇక్కడ రోజు రోజుకు వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. ఆ పార్టీ గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతుంటే టీడీపీ గ్రాఫ్ తగ్గుతోంది. ఇక్కడ అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. నియోజకవర్గంలో 56 వేల ఓటర్లు ఉన్న ముస్లింలను ఆకట్టుకునేందుకు చంద్రబాబు ఇక్కడ ఇద్దరు ముస్లిం వ్యక్తులకు రెండు కీలక పదవులు ఇచ్చారు. కాంగ్రెస్లో చేరిన నౌమాన్కు కార్పొరేషన్ పదవితో […]