ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో బంగార్రాజు ఒకటి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఆ పాత్ర ఆధారంగానే ప్రస్తుత సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా జూలై రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఇటీవల నాగార్జున చెప్పారు. ఈ కథ అంతా కూడా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. […]
Tag: Latest news
భారత్లో కరోనా కల్లోలం..4 లక్షలకుపైగా కొత్త కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్లో 4,14,188 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,14,91,598 కు చేరుకుంది. అలాగే నిన్న 3,915 మంది […]
ఆ హీరోయిన్కు అల్లు శిరీష్ స్పెషల్ గిఫ్ట్..నెట్టింట్లో మళ్లీ రచ్చ!
అల్లు శిరీష్..2013లో ఇండస్ర్టీలోకి ఇచ్చిన ఈయనపై ఇప్పటి వరకు ఎలాంటి రూమర్స్ లేవు. ఎందుకంటే.. ఈయన ఎప్పుడూ తన సినిమాలు, పర్సనల్ పనులు అవీ కాదంటే ఫిట్నెస్ ఫోకస్తో బిజీగా ఉంటాడు. కానీ, గత కొద్దిగా రోజులుగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్తో శిరీష్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. ఎవరికైనా వీరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ నడుస్తుందన్న అనుమానం రాకమానదు. షూటింగ్ లొకేషన్స్, పార్టీలు, వ్యానిటీ రూం, కాఫీ షాప్ ఇలా ఎక్కడపడితే అక్కడే ఈ ఇద్దరూ హల్చల్ […]
తెలంగాణలో 2,625కి చేరిన కరోనా మరణాలు..తాజా కేసులెన్నంటే?
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. తెలంగాణలోనూ నిన్న మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,892 పాజిటివ్ కేసులు […]
బాలయ్యకు జోడీగా ప్రభాస్ హీరోయిన్..సెట్ చేసిన గోపీచంద్?
క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మాలినేని.. త్వరలోనే నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ చేస్తున్న బాలయ్య.. ఆ వెంటనే గోపీచంద్తో సినిమా స్టార్ చేయనున్నారు. వీరి కాంబో చిత్రాన్ని మైత్రిమూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు. ఇక బాలయ్య కోసం ఓ పవర్ ఫుల్ కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యాధార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతోందని.. అందులో బాలయ్య […]
`ఆర్ఆర్ఆర్`లో ఆ 20 నిమిషాలు కన్నుల పండగేనట!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్. అయితే ఈ చిత్రంలో పర్టిక్యులర్ గా ఓ […]
బన్నీ ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్న సుక్కు?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్నారు. కరోనా సమయంలోనూ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా సమాచారం ప్రకారం.. బన్నీ ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడట సుక్కు. ఇంతకీ విషయం […]
గర్భవతి అని తెలియదు..కానీ, బిడ్డ పుట్టేసింది!
మాతృత్వం ఎంత గొప్పదో మాటల్లో వర్ణించలేనిది. అందుకే పెళ్లైన ప్రతి స్త్రీ గర్భం దాల్చాలని.. పండంటి బిడ్డకు జన్మ నివ్వాలని తహతహలాడుతుంది. అయితే తాజాగా అమెరికాలో ఓ విచిత్ర, వింతైన సంఘటన చోటు చేసుకుంది. గర్భవతి అన్న విషయం తెలియకుండానే ఓ మహిళకు బిడ్డ పుట్టేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..అమెరికాలోని యూటా రాష్ట్రానికి చెందిన లావినియా మౌంగ తన ఫ్యామిలీతో కలిసి విహార యాత్రకని హవాయిలోని హనలూలూకి ఫైట్లో బయల్దేరింది. ప్రయాణంలో ఆమెకు ఒక్కసారిగా కడుపులో నొప్పులు […]
వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఫ్రీ..త్వరపడండి!
ప్రస్తుతం కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వాలు జోరుగా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ కొనసాగిస్తోంది. అయితే పలు అపోహలు కారణంగా యువత వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రాకపోవడంతో..ప్రభుత్వాలు వినూత్న ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ వేసుకున్న యువతకు బీరు బాటిల్ను ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తాజాగా అగ్రరాజ్య అధినేత జో బైడెన్ జూలై 4 నాటికి 70 శాతం మంది యువతకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. […]