లోకేష్ పాదయాత్రకు ఊహించని కండిషన్స్..సాధ్యమేనా?

ఎట్టకేలకు నారా లోకేష్ పాదయాత్రకు పర్మిషన్ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చి..రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించకూడదని కండిషన్స్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కండిషన్స్ కేవలం ప్రతిపక్షాలకే అని, వైసీపీకి ఈ కండిషన్స్ వర్తించడం లేదని విమర్శలు వచ్చాయి. ఇదే తరుణంలో ఈ జీవోని కొట్టేయాలని సి‌పి‌ఐ నేత రామకృష్ణ కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ జరుగుతుంది..తుది తీర్పు మంగళవారం వస్తుంది. అయితే ఈ జీవోలో ఉన్న లాజిక్‌లతో లోకేష్ పాదయాత్రకు […]

లోకేష్ పాదయాత్రపై కన్ఫ్యూజన్..పర్మిషన్లలో చిక్కులు.!

నారా లోకేష్ పాదయాత్ర పర్మిషన్ల విషయంలో క్లారిటీ లేకుండా పోయింది…ఇప్పటికే జనవరి 27న కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుకానున్న విషయం తెలిసిందే..దీనికి సంబంధించిన ఏర్పాట్లని సైతం పూర్తి చేసే పనిలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం1 వల్ల లోకేష్ పాదయాత్రకు కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే లోకేష్ పద్యతరకు పర్మిషన్ ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు ఏపీ డి‌జి‌పికి, చిత్తూరు ఎస్పీకి, కుప్పం పోలీసులకు  లేఖ రాశారు. అయితే […]

కడప వైసీపీలో రచ్చ..నేతల పోరుతో రిస్క్..!

సీఎం జగన్ సొంత జిల్లా కడపలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తుంది. ఉండటానికి ఇక్కడ 10 స్థానాల్లో 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు..జిల్లాలో వైసీపీ హవానే ఉంది. కానీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో నిదానంగా ఆధిపత్య పోరు పెరుగుతూ వస్తుంది. కొన్ని స్థానాల్లో నేతలు గ్రూపులుగా విడిపోయే సెపరేట్ గా రాజకీయాలు చేస్తున్నారు. ఈ జిల్లాలో టీడీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. కానీ అంతకంటే వైసీపీలో ఈ రచ్చ ఎక్కువ కనిపిస్తోంది. మొదట […]

బీఆర్ఎస్ ఎదిగితే.. ఏపీలో ఎవ‌రికి న‌ష్టం.. ?

ఏపీలో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మకంగా మారాయి. టీడీపీ-జ‌న‌సేన పొత్తుతో అధికారం లోకి వ‌చ్చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాయ‌నే చ‌ర్చ సాగుతోంది. ఇక‌, వైనాట్ 175 నినాదంతో మ‌రోసారి విజ యం ద‌క్కించుకునేందుకు వైసీపీ ప్ర‌య‌త్నాలు సాగిస్తోంది. ఈ మొత్తం వ్య‌వ‌హారం గ‌మ‌నిస్తే.. ఏపీలో రెండు ప‌క్షాల మ‌ధ్య ఎన్నిక‌ల రాజ‌కీయం ఊపందుకుంది. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల్చ‌న‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చెబుతున్నాడు. ఈ క్ర‌మంలో టీడీపీ-జ‌నసేన క‌లిస్తే.. ఖ‌చ్చితంగా అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని […]

వైసీపీలో కొత్త గోల మొద‌లైంది… జ‌గ‌న్‌కు ఇదో బిగ్ టెన్ష‌న్‌…!

వైసీపీ అధిష్టానానికి టెన్ష‌న్ పెరుగుతోంది. బీపీ కూడా అదే రేంజ్‌లో పెరుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ `వైనాట్ 175` నినాదం అందుకుని ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. దీనికి కావాల్సింది.. నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త‌. పోటీలేని.. టికెట్ల వ్య‌వ‌హారం.. రెబ‌ల్స్ పెర‌గ‌కుండా చూసుకోవ‌డం.. ప్ర‌జ‌ల‌కు నాయ‌కుల‌కు మ‌ధ్య ఫెవికాల్ బంధం బ‌లోపేతం కావ‌డం. అయితే.. ఈ కీల‌క సూత్రాలే ఇప్పుడు క‌నిపించ‌డం లేద‌న్న‌ది వైసీపీ అధిష్టానం ఆవిరులు క‌క్కుతోంది. ఎందుకంటే.. ఎటు చూసినా.. టికెట్ గోల […]

ఏపీలో వైఎస్‌కు ఎదురైన సీనే జ‌గ‌న్‌కు కూడా ఎదుర‌వుతోందా…!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి పొత్తులు.. పొర్లాట‌లు.. అంటూ ఏపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తున్న విష యం తెలిసిందే. టీడీపీ-జ‌నసేన పొత్తు పెట్టుకుంటాయని.. కొన్నాళ్లుగా చ‌ర్చ న‌డుస్తోంది. అయితే.. ఇప్ప టికే బీజేపీ-జ‌న‌సేన పొత్తులో ఉన్న విష‌యం తెలిసిందే. ఇక‌, టీడీపీ ప్ర‌స్తుతానికి ఒంట‌రిగా ఉంది. క‌మ్యూ నిస్టులు కూడా ఎటూ దారి లేక‌.. అలానే ఉండిపోయారు. ఏదో ఒక మార్గం ద‌క్క‌క పోతుందా.. అని కామ్రేడ్స్ ఎదురు చూస్తున్నారు. ఇక‌, మిగిలిన చిన్నా చిత‌కా పార్టీలు […]

పవన్‌పై ఆలీ పోటీ..జగన్ ఛాన్స్ ఇస్తారా?

ప్రత్యర్ధులని వ్యూహం ప్రకారం దెబ్బ  తీసే విషయంలో అధికార వైసీపీ ఎప్పుడు ముందే ఉంటుందని చెప్పాలి. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో రాజకీయం చేయడం…ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి ప్రత్యర్ధులని వీక్ చేసి దెబ్బకొట్టడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. గత ఎన్నికల్లో అదే మాదిరిగా ఓ వైపు టీడీపీ, మరోవైపు జనసేనలకు చెక్ పెట్టారు. అయితే ఈ సారి కూడా ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టాలని వైసీపీ చూస్తుంది. అలాగే ఈ సారి […]

వైసీపీలో టాప్ లీడ‌ర్‌కు చెక్ పెట్టేస్తోందెవ‌రు… అదిరిపోయే ట్విస్ట్‌..!

ఉమ్మడి తూర్పు గోదావ‌రి జిల్లాలోని రామ‌చంద్ర‌పురం నియోజ‌క‌వ‌ర్గం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నేనంటే నేనే అని ఇద్ద‌రు నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. ఒక‌రు మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ కాగా, మ‌రొక‌రు.. ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తులు. తాజాగా.. ఈ ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య రాజ‌కీయ‌సెగ మ‌రింత పెరుగుతోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందో అని చ‌ర్చ కూడా మొద‌లైంది. రామ‌చంద్ర‌పురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నాయ‌కులు […]

చంద్ర‌బాబును వ‌ర్మ ఎందుకు వ‌ద‌ల‌ట్లేదు… మ‌రో సినిమా కూడా..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు కు ఏపీ వైసీపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య తీవ్ర రాజ‌కీయ యుద్దం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఈఏడాది ప్రారంభంలో తీసుకువ‌చ్చిన జీవో 1/2023 మ‌రింత‌గా రాజ‌కీయ మంటలు రాజేసింది. కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకునేందు కు ఈ జీవోను పోలీసులు చూపించారు. చంద్ర‌బాబు కుప్పం టూర్‌పై ఇప్పుడే కాదు గ‌తంలోనూ వైసీపీ ప్ర‌భుత్వం నుంచి చాలా ఆంక్ష‌లే వ‌చ్చాయి. తాజాగా జ‌గ‌న్ స‌ర్కార్ తెచ్చిన జీవోపై […]