ఏపీ బాలిక‌కు కేసీఆర్ త‌న‌య సాయం..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక సేవ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డంలో ముందుంటారు. కొవిడ్ స‌మ‌యంలో నిజామాబాద్ కేంద్రంలో నిర‌వ‌ధికంగా అన్న‌దానం చేస్తున్నారు. అంతేకాదు దుబాయ్‌, మ‌స్క‌ట్ త‌దిత‌ర అర‌బ్ దేశాల్లో చిక్కుకున్న‌వారిని స్వ‌దేశానికి తీసుకురావ‌డానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్ర‌జాసేవకు సరిహద్దులు లేవని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత ఆపన్న హస్తం అందించారు. ప్రకాశం జిల్లాకు చెందిన చిన్నారి జ్ఞాపిక వెన్నెముక ఆపరేషన్ […]

ఏపీలో కర్ఫ్యూ.. ఎప్పటి నుంచి అంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5వ తారీఖు నుండి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలకు మాత్రం పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత కూడా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రెండు వారాల వరుకు ఈ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటుంది. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి […]

అనంత‌పురంలో తీవ్ర విషాదం.. ఆక్సిజ‌న్ అంద‌క‌..

కొవిడ్ సెకండ్ వేవ్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. ఊపిరాడ‌నివ్వ‌డం లేదు. రెండో ద‌ఫాలో చాలా మంది శ్వాస‌కోశ సంబంధిత ఇబ్బందుల‌తో, ముఖ్యంగా ఆక్సిజ‌న్ అంద‌క‌నే ప్రాణాల‌ను కోల్పోతుండ‌డం విచార‌క‌రం. ఇప్ప‌టికే ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌, ఒడిశా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ త‌దిత‌ర రాష్ట్రాల్లో ప‌దుల సంఖ్య‌లో కొవిడ్ బాధితులు ప్రాణాల‌ను కోల్పోయారు. ఇప్ప‌టికే అనేక వైద్య‌శాల‌ల్లో ఆక్సిజ‌న్ కొర‌త నెల‌కొన్న‌ది. కేంద్రం సైతం ఆగ‌మేఘాల మీద ఆయా రాష్ట్రాల‌కు ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. అయిన‌ప్ప‌టికీ స‌కాలంలో ఆక్సిజ‌న్ అంద‌క రోగులు విగ‌త‌జీవులుగా మారుతున్నారు. […]

ఏపీలో వచ్చే సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్..!?

వచ్చే సంవత్సరం నుండి సీబీఎస్ఈ సిలబస్ ని కూడా రాష్ట్రంలో తీసుకొస్తామని ఏపీ సీఎం అయిన వైఎస్ జగన్ చెప్పారు. జగన సర్కార్ వసతి దీవెన పథకం కింద ఏపీ సీఎం వైఎస్ జగన్ విద్యార్ధులకు ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ఈ మేరకు బుధవారం నాడు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశారు. కరోనా సమయంలా కూడా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్ గుర్తు చేశారు. జగనన్న వసతి […]

పది, ఇంటర్ పరీక్షలపై జగన్ క్లారిటీ..!?

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఓ వైపు రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లి దండ్రులు అంతా పరీక్షలను రద్దు చేయాలి లేదా వాయిదా వేయాలని కోరుతున్నారు. అటు అధికారులు కూడా పరీక్షల నిర్వహణ అసాధ్యం అంటూ అభిప్రాయం పడుతున్నారు. తాజాగా పలు జిల్లాల్లో పదో తరగతి విద్యార్థులకు కరోనా సోకటంతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇకమీదట తమ పిల్లల్ని స్కూళ్లకి పంపించలేమంటూ […]

కరోనాపై జగన్ కీలక నిర్ణయం..!?

ఏపీలో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో స్పందన సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. కారానికి సంబంధించిన అన్ని సమస్యలకు 104 కాల్ సెంటర్ వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ గా ఉండాలని అన్నారు. 104కు ఫోన్‌ చేసిన వెంటనే 3 గంటల్లో బెడ్‌ కేటాయించాలని ఆయన ఆదేశించారు. మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలని, 104 కాల్‌ సెంటర్‌కు సంబంధించి తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. అన్ని ఆస్పత్రులలో వైద్య […]

ఆ పరీక్షలు రద్దు చేయాలనీ పవన్ డిమాండ్..!

ప్రస్తుత కరోనా ఉధృతిలో పదో తరగతి పరీక్షలు నిర్వహణ మూర్ఖత్వమే అవుతుందంటూ ఏపీ సర్కార్ నిర్ణయం పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంది పడ్డారు. లక్షలాది విద్యార్థులతో పాటు వారి కుటుంబాలను కూడా కరోనా ముప్పులోకి పడేస్తున్నారంటూ అన్నారు. సీబీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి ప్రమోట్ చేసిందని, ఒక్క ఏపీ ప్రభుత్వానికి మాత్రమే ఇబ్బంది వచ్చిందా అంటూ ప్రశ్నించారు. తక్షణమే 10 తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను […]

రైతుల కోసం మరో పథకం అమలు చేయనున్న జగన్ సర్కార్..!

ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 2019 ఆర్బిఐ కి సంబంధించిన రుణాల పై వడ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుందని సీఎం జగన్ అన్నారు. ప్రపంచమంతా రైతు పైనే ఆధారపడి జీవిస్తోందన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ఈ రెండేళ్లలో అమలు చేశామని ఆయన సగర్వంగా చెప్తున్నామన్నారు. రైతులకు ఇచ్చిన హామీల్లో అమల్లో భాగంగా […]

ఏపీలో లాక్ డౌన్ పై జగన్ సంచలన ప్రకటన..?

ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకూ కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి. మరో వైపు మరణాల సంఖ్య కూడా ఎక్కువ అవుతున్న క్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని సమాచారం. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌ పై మంగళవారం సీఎం నేతృత్వంలో హై లెవల్ మీటింగ్ జరగబోనుంది. ఈ మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు జగన్ము సర్కార్. పదో తరగతి ప‌రీక్ష‌ల ర‌ద్దు, నైట్ కర్వ్ఫూ, ఇంటర్ పరీక్షలు వాయిదా, స్కూళ్ల‌కు సెల‌వుల ‌పై […]