జ‌గ‌న్‌తో జూనియ‌ర్ ఎన్టీఆర్ భేటీ.. ఏం జ‌రుగుతోంది..!

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అంతా సినిమా టిక్కెట్ల ధ‌ర‌లు, ఇండ‌స్ట్రీకి సంబంధించి చాలా విష‌యాల‌పై చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్ర‌భుత్వంతో టాలీవుడ్‌కు పెద్ద గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను భ‌ర్తీ చేసేందుకు చాలా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నా అవేవి ఓ కొలిక్కి రావ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ త‌ర్వాత అయినా స‌మ‌స్య ఓ కొలిక్కి వ‌స్తుంద‌నే అంద‌రూ అనుకున్నారు. అయితే ఇంత‌లోనే ట్విస్ట్‌.. అది […]

రోజాను ఇంత తొక్కేస్తున్నారా.. జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కూడా లేదే..!

అదేం అదృష్ట‌మో కానీ.. వైసీపీ నాయ‌కురాలు.. ఫైర్ బ్రాండ్, న‌గ‌రి ఎమ్మెల్యే రోజాకు గ‌తంలో ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి సెగ వ‌స్తే.. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. సొంత పార్టీ నేత‌ల నుంచే సెగ భారీ ఎత్తున త‌గులుతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి రాష్ట్రంలో అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఉన్న మాట వాస్త‌వ‌మే. అయితే.. దీనికి మించి.. అన్న‌ట్టుగా రోజాకు సెగ త‌గులుతోంది. ఆమెను డ‌మ్మీ చేసేందుకు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అస‌లు టికెట్ కూడా […]

ఏపీ విభజనపై మోడీ మళ్లీ కీలక వ్యాఖ్యలు .

ఈ రోజు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ పునర్వవిభజన జరిగిన తీరున ప్రధానమంత్రి మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు .రాష్ట్ర విభజన సరిగా జరగలేదని దాని వలన రెండు రాష్ట్రలో ఇంకా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పారు .మరొక సారి కాంగ్రెస్ పార్టీ పై అయన విరుచుకుపడ్డారు. మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెతిరేకం కాదు .వాజ్ పేయి మూడు రాష్ట్రాలు విభజించారు .శాంతి యుతంగా కూర్చుని అన్ని చర్చించి ఆ […]

వంగవీటి రాధపై బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ లో వైస్ జగన్ సర్కార్ కొత్త జిల్లాల ప్రకటన చేసిన తరువాత రాష్ట్రంలో అనేక ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే .రాజంపేట ప్రధాన కేంద్రంగా అన్నయ్య జిల్లాగా ,హిందూపూర్ ప్రధాన కేద్రంగా సత్యసాయి జిల్లాలకు పెద్ద ఎత్తున్న ఆందోళను జరుగుతున్నాయి .అలాగే వంగవీటి రంగ జిల్లా ఏర్పాటు చేయాలి పెద్ద ఎత్తున అభిమానులు ,కాపు నాయకులు పోరాడుతున్నారు . అయితే తెలుగు దేశం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా రంగ జిల్లా ఏర్పాటుపై […]

ఫైనల్ లిస్ట్ రెడీ … వైసీపీలో కొత్త మంత్రులుగా వీళ్లే ?

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వంలో మంత్రి వ‌ర్గాన్ని విస్త‌రించేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి 2019లో ప్ర‌బుత్వం ఏర్ప‌డిన‌ప్పుడే. రెండున్న‌రేళ్ల‌కు త‌న మంత్రి వ‌ర్గాన్ని 90 శాతం వ‌ర‌కు మార్పుచేస్తాన‌ని.. సీఎం జ‌గ‌న్ చెప్పారు. దీంతో అప్ప‌టి కే మంత్రి ప‌ద‌వులు వ‌స్తాయ‌ని ఆశించిన వారు.. ఈ ప్ర‌క‌ట‌న‌తో నెమ్మ‌దించారు. జ‌గ‌న్ మాట ఇస్తే.. త‌ప్ప‌రు..అన్న విధంగా ఆయ‌న మాట ఎప్పుడు నెర‌వేర్చుకుంటారా? అని వీరు ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు.. మంత్రుల జాబితాలో రోజు రోజుకు పేర్లు […]

అన్న‌దాత‌ల‌కు ‘ నోవా ‘ అండ‌.. కృషీవ‌లుడు ‘ ఏలూరి ‘ మ‌రో ముంద‌డుగు

ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ ఉన్న ప్ర‌భుత్వాలు.. సేంద్రియ సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నా యి. ఇక‌, ప్ర‌జ‌లు కూడా ర‌సాయ‌న వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల కంటే కూడా.. సేంద్రియ సాగు ఉత్ప‌త్తుల‌కు మొగ్గు చూపుతున్నారు. దీంతో సేంద్రియ వ్య‌వ‌సాయ‌మే మున్ముందు ప్ర‌ధానం కానుంది. ఈ నేప‌థ్యంలో ప‌రుచూరు టీడీపీ ఎమ్మెల్యే, నిత్య కృషీవ‌లుడిగా పేరు తెచ్చుకున్న ఏలూరి సాంబ‌శివ‌రావు… త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా.. సేంద్రియ సాగులో త‌న‌దైన సేవ‌లు అందించాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో సేంద్రియ […]

దేవినేని అవినాష్ ఈ సారి గెలుస్తాడా… బెజ‌వాడ‌లో రాజ‌కీయంలో ఈ మార్పు ఏంటో ?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. దీంతో ఆయ‌న గెలుపును ఎవ‌రూ ఆప‌లేరు.. అనే మాట జోరుగా వినిపిస్తోంది. ప్రతి ఒక్కరిని కలుస్తూ ఆయా సమస్యలపై చర్చిస్తూ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో దేవినేని అవినాష్ పేరు మార్మోగుతోందనే చెప్పాలి. వాస్తవానికి గతంలో ఎవరు కూడా ఇలా పని చేయలేదనే టాక్‌ ఉంది. దీంతో వచ్చే ఎన్నికలలో దేవినేని అవినాష్ ఖ‌చ్చితంగా గెలుపు గుర్రం ఎక్కుతార‌నే అంటున్నారు. నియోజకవర్గంలో […]

ముందస్తు లేదని ఇన్నిసార్లు చెబుతున్నారెందుకు?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదు. రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సజ్జల చెబితే ఇక సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టే. నిజానికి ప్రభుత్వంలోని చాలా మంది పెద్దలు కొన్ని రోజులుగా ముందస్తు లేదు.. ముందస్తులేదు అని పదేపదే చెబుతున్నారు. ఆ రకంగా ప్రజలకు ఈ ప్రభుత్వం పూర్తికాలం ఉంటుందనే నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా సజ్జల కూడా చెప్పేశారు. దీనితో ఫైనల్ అథారిటీ కూడా చెప్పేసినట్టే. […]

జగన్ మళ్లీ ఔదార్యం ప్రదర్శిస్తారా?

రాజకీయంగా పొందగలిగిన ఉన్నతమైన పదవుల మీద పార్టీలో చాలా మందికి కన్ను ఉంటుంది. అలాంటి వాటిలో ఎక్కువ మంది ఆశించేవి ఎమ్మెల్సీ పదవులు, రాజ్యసభ సభ్యత్వాలు. సాధారణ నాయకుల కంటె పార్టీకి అత్యంత ముఖ్యమైన వారు ఆశించేది రాజ్యసభ సభ్యత్వం! అంతూ దరీ లేకుండా పార్టీనే నమ్ముకుని.. రాత్రింబగళ్లూ పార్టీకే సేవ చేస్తూ ఉండే నాయకులు అనేక మంది ఉంటారు. అలాంటి వారు.. తమకు పార్టీ ఏదో ఒక సందర్భంలో సముచితమైన పదవులు కట్టబెడుతుందనే.. ఆశతో బతుకుతుంటారు. […]