కాక రేపుతున్న తెలంగాణ పాలిట్రిక్స్…!

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని ప్రధాన పార్టీల నేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టాయి. తెలంగాణ విమోచన దినోత్సవం రోజునే ఇద్దరు అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఒకేరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, సోనియా గాంధీ తెలంగాణలో పర్యటించేందుకు ఏర్పాట్లు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 17న ప్రధానమంత్రి మోదీ సభకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. […]

టార్గెట్ తెలంగాణ… బీజేపీ మాస్టర్ ప్లాన్…!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలనుకుంటుంది. ఇటీవల ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ అభ్యర్ధుల తొలిజాబితాను అధిష్టానం ప్రకటించింది. మరో వారం, పది రోజుల్లో తెలంగాణ, రాజస్థాన్ అభ్యర్ధుల జాబితాను కూడా విడుదల చేయనుంది. అయితే ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు గణనీయమైన సీట్లు కేటాయించాలనుకుంటున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పూర్తి భిన్నమైన వ్యూహాలను అనుసరించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మొత్తం 119 […]

ఎమ్మెల్యేలకు ఎర్త్‌ పెడుతున్న ఎమ్మెల్సీలు….!

బీఆర్ఎస్‌లో చాలా మంది ఎమ్మెల్సీలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎర్త్ పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం రేసులోకి దూసుకొచ్చి ఎమ్మెల్యేలకు షాక్‌ ఇస్తున్నారు. ఎమ్మెల్సీలు సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులనే తమవైపు తిప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అధ్యక్షా అనాలని ఉవ్విళ్లూరుతున్నారు బీఆర్ఎస్‌ నేతలు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో సిట్టింగ్‌లకు చెక్‌ పెట్టి సీటు దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. దీంతో తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వర్సెస్‌ […]

రాజద్రోహం చట్టానికి కేంద్రం చెల్లుచీటీ… ఇకపై దేశ ద్రోహ చట్టం…!

రాజద్రోహం చట్టానికి కేంద్ర ప్రభుత్వం చెల్లుచీటీ పాడింది. నేర న్యాయ వ్యవస్థలో కీలక మార్పులు చేసింది. మూక దాడులకు మరణశిక్ష తప్పదని హెచ్చరించింది. కోర్టులో వాదనలు పూర్తయిన నెల రోజుల్లో తీర్పు చెప్పాలని సూచించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ఆఖరిరోజున ప్రభుత్వం దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టింది. 17 రోజుల్లో 44 గంటలకుపైగా లోక్‌సభా కార్యకలాపాలు సాగినట్లు స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లా వెల్లడించారు. మరో పక్క అవిశ్వాస తీర్మానంపై మోదీ రెండు గంటలు మాట్లాడితే అందులో […]

హైదరాబాద్ ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ వినూత్న నిర్ణయం..!

హైదరాబాద్ ప్రయాణీకులకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో 1300 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తీసుకురావాలని TSRTC నిర్ణయించింది. పర్యావరణ హితం, కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతుంది. త్వరలో 25 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వాడకంలోకి తెచ్చేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌ లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త ప్రోటో (నమూనా) ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సును టీఎస్ఆర్టీసీ […]

గద్దర్ మరణించడానికి గల కారణాలు ఏంటో తెలుసా..?

ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో గత రెండు రోజుల నుంచి చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే చికిత్స నిమిత్తం ఆయన కన్నుమూసినట్లుగా తెలుస్తోంది గుండెపోటుతో కొద్దిరోజుల క్రితం అమీర్పేటలోని అపోలో హాస్పిటల్లో చేరినట్లుగా తెలుస్తోంది. అయితే అక్కడే చికిత్స పొందుతూ ఈయన తుది శ్వాస విడిచినట్టుగా సమాచారం. గద్దర్ పీపుల్ వార్ ,మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాలలో తన గలంతో ఎంతోమంది కోట్లాదిమంది ప్రేక్షకులను సైతం ఉత్తేజపరిచేలా చేశారు. […]

అందరి చూపు రాజ్‌భవన్ వైపే… గవర్నర్ నిర్ణయం ఏమిటీ…?

తెలంగాణలో అందరి చూపు రాజ్ భవన్ వైపే ఉంది. ఇందుకు ప్రధాన కారణం ఆర్టీసీ విలీన బిల్లు. నేటితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దానిని ఆర్డినెన్స్‌గా మార్చి… గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపింది. ఆ బిల్లుకు ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదు. బిల్లును గవర్నర్ పక్కన పెట్టారంటూ పుకార్లు వచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు బంద్ చేశారు. రాజ్ భవన్‌ను ముట్టడించారు. ఈ నేపథ్యంలో బిల్లుపై […]

MS. ధోని కూతురు స్కూల్ ఫీజు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!

ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ధోనికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మహేంద్ర సింగ్ ధోని సాక్షి దంపతులకు 2015లో ఒక పాప జన్మించింది. ఆ పాప పేరు జీవా.. ధోని కూతురు జీవా జార్ఖండ్లో తల్లితండ్రుల సమక్షంలోనే పెరుగుతోంది. ప్రస్తుతం ధోని కూతురు వయసు 8 సంవత్సరాలు. ఈ పాప మూడవ తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాప ప్రస్తుతం ఉన్న […]

విరాట్ కోహ్లీ కోసం స్పెషల్ ఫ్లైట్…. కారణం ఇదే….!!

వెస్టిండీస్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫ్లైట్ లో తన స్వదేశానికి చేరుకున్నాడు. గ్లోబుల్ ఎయిర్ చార్టర్ సర్వీసెస్ సంస్థ ఏర్పాటు చేసిన‌ ప్రత్యేక విమానంలో విరాట్ సదేశానికి వ‌చ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా లో పోస్ట్ చేశాడు. ప్రత్యేక ఏర్పాటు చేసినందుకు గ్లోబల్ ఎయిర్ చార్టర్, కెప్టెన్ అబు పటేల్ కు థాంక్స్ అని విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. వెస్టిండీస్ తో టెస్టు […]