నన్ను కించ పరిచిన పార్టీలో ఒక్క నిమిషమైన ఉండనంటున్న బోండా

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ త‌ర్వాత.. ఏపీలో రాజ‌కీయాలు హీటెక్కాయి. మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కని వారు ఇప్పుడు ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నార‌నే ప్ర‌చారం జోరందుకుంది. ముఖ్యంగా అటు వైసీపీ, ఇటు జ‌న‌సేన వైపు చూస్తున్నార‌నే గుస‌గుస‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. అసంతృప్తి నాయ‌కులకు చెందిన క్యాడ‌ర్ తీవ్ర ఆగ్ర‌హ జ్వాల‌తో ఉంది. ముఖ్యంగా ప్ర‌తిపక్షంపై నిత్యం విరుచుకుప‌డే విజ‌యవాడ ఎమ్మెల్యే బోండా ఉమ‌.. త‌న‌కు మంత్రిప‌ద‌వి ద‌క్క‌కపోవ‌డంపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న ప‌వ‌ర్ స్టార్ […]

ఉలిక్కి పడ్డ చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఆశావాహుల మ‌ధ్య పెద్ద చిచ్చే పెట్టింది. మంత్రి ప‌ద‌వులు రాని ఆశావాహులు, సీనియ‌ర్లు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌వి పోయిన సీనియ‌ర్ లీడ‌ర్ బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌గా, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు సైతం తాను రాజీనామాకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఇక విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియ‌ర్ లీడ‌ర్ గౌతు […]

బాబు కేబినెట్‌లో క్యాస్ట్ ఈక్వేష‌న్ లెక్క త‌ప్పిందిగా…

ఏపీ కేబినెట్ విస్త‌ర‌ణ సొంత పార్టీ నేత‌ల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. మొత్తం 26 ఖాళీలు పూర్తి కావ‌డంతో ఇక కొత్త‌గా ఎవ్వ‌రికి ఛాన్స్ ఇచ్చే ప‌రిస్థితి కూడా లేదు. ఈ విస్త‌ర‌ణ‌లో కులాల లెక్క త‌ప్పిన‌ట్టు రాజ‌కీయంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కొన్ని సామాజిక‌వ‌ర్గాల‌కే పెద్ద పీఠ వేయ‌గా మ‌రి కొన్ని కీల‌క కులాల‌కు అస్స‌లు ప్రాధాన్య‌మే ల‌భించ‌లేదు. మైనార్టీలు, ఎస్టీలతో పాటు క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం నుంచి ఒక్క మంత్రికి కూడా చోటులేదు. దీంతో ఈ వ‌ర్గాల్లో […]

టీటీడీ చైర్మ‌న్‌గా బాబు ఓటు ఆయనకే

టీటీడీ చైర్మ‌న్ ప‌దవికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు జోరుగా లాబీయింగ్ మొద‌లుపెట్టార‌ట‌. శ్రీ‌వారి సేవ‌లో త‌రించాలంటే .. ముందుగా సీఎం చంద్ర‌బాబు ఆశీర్వాదం త‌ప్ప‌నిస‌రి. దీంతో ఇప్పుడు ఈ ప‌ద‌వి ఆశిస్తున్న నేత‌లు.. చంద్ర‌బాబును ప్ర‌సన్నం చేసుకునే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇందులో ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ చంద్ర‌బాబు దృష్టిలో వేరే వ్య‌క్తి పేరు మెద‌లుతోంద‌ట‌. దీంతో ఇక రాయ‌పాటికి ఈసారీ నిరాశే ఎదుర‌వ‌వ‌చ్చ‌నే ప్ర‌చారం వినిపిస్తోంది. ఈసారి ఈప‌ద‌వి వివాద‌ర‌హితుడు, త‌న‌కు […]

టీడీపీకి రావెల గుడ్ బై..! ఏపీ బీఎస్పీ అధ్యక్ష పదవికి చూపు

ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో ఉద్వాస‌న‌కు గురైన గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి రావెల కిషోర్‌బాబు టీడీపీకి గుడ్ బై చెప్ప‌నున్నాడా ? మంత్రి ప‌ద‌వి నుంచి త‌న‌ను త‌ప్పిస్తార‌ని ముందే ఊహించిన రావెల ఈ మేర‌కు పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకున్నాడా ? అంటే ఏపీ ఇంటిలిజెన్స్ వ‌ర్గాలు సీఎం చంద్ర‌బాబుకు అందించిన నివేదిక ప్ర‌కారం అవున‌నే ఆన్స‌రే వ‌స్తోంది. కేంద్ర స‌ర్వీసుల్లో ప‌నిచేసిన రావెల కిషోర్‌బాబుకు చంద్ర‌బాబు గ‌త ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లా […]

బాబుకు షాక్‌: జ‌గ‌న్ చెంతకు 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు

ఏపీ కేబినెట్ ప్రక్షాళ‌న అధికార టీడీపీలో సెగ‌లు రేపుతోంది. మంత్రి ప‌ద‌వి రాద‌ని డిసైడ్ అయిన చాలా మంది సీనియ‌ర్లు బాబుకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. కొంద‌రైతే త‌మ‌కు మంత్రి ప‌ద‌వి రాక‌పోయినా ఓకే గాని..త‌మ శ‌త్రువుల‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తే పార్టీ వీడేందుకు కూడా సిద్ధ‌మే అని బాబుకు హెచ్చిరిక‌లు పంపుతున్నార‌ట‌. క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇస్తే తాను పార్టీలో ఉండ‌న‌ని రామ‌సుబ్బారెడ్డి ఇప్ప‌టికే బాబును క‌లిసి చెప్పేశార‌ట‌. ఈ […]

కాంగ్రెస్ దూకుడుకు `సెంటిమెంట్‌`తో టీఆర్ఎస్ క‌ళ్లెం

తెలంగాణ‌లో ఇటీవ‌ల కాంగ్రెస్ దూకుడు పెంచింది. టీఆర్ఎస్ వైఫ‌ల్యాల‌పై ప్ర‌చారం ఉద్ధృతం చేస్తోంది. నాయ‌కులు కేసీఆర్‌పై విరుచుకుప‌డుతున్నారు. ఇప్పుడు వీరి దూకుడుకు క‌ళ్లెం వేసేందుకు మ‌ళ్లీ సెంటిమెంట్ అస్త్రాన్ని టీఆర్ఎస్ బ‌య‌ట‌కు తీసింది. తెలంగాణ వాదాన్ని మ‌రోసారి వినిపించాల‌ని నిర్ణ‌యించుకుంది. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మ‌రోసారి త‌మ సెంటిమెంట్ బంధాల్లో క‌ట్టేయ‌డానికి కేసీఆర్ అండ్ కో సిద్ధ‌మైంది. తెలంగాణ ప్ర‌జ‌ల కోసం ఏర్ప‌డిందే టీఆర్ఎస్ అని.. మిగిలిన పార్టీల వ‌ల్ల తెలంగాణ‌కు ఒరిగింది ఏమీ లేదని నమ్మ‌బ‌లికే ప్ర‌య‌త్నం […]

జ‌గ‌న్ కొంప ముంచుతున్న బాబు కోవ‌ర్టులు

వైసీపీ అధినేత జ‌గ‌న్ అక్ర‌మాస్తుల వ్య‌వ‌హారం మ‌ళ్లీ తెర‌పైకి రావడంతో ఆ పార్టీ నేత‌ల్లో గంద‌ర‌గోళం మొద‌లైంది. జ‌గ‌న్‌కు చెందిన ఒక చానెల్‌లో.. కేసుల‌కు సంబంధించిన వ్య‌క్తికి ఇంట‌ర్వ్యూ చేసిన స‌మ‌యంలో.. ఈ కేసుల గురించి ప్ర‌స్తావించ‌డంతోనే ఇదంతా జ‌రిగింద‌ని వారు అంత‌ర్గ‌తంగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఆ కేసుల గురించి ఎవ‌రు అడ‌గ‌మ‌న్నారు అనేదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కోర్టు ప‌రిధిలో ఉన్న కేసుల గురించి మాట్లాడకూడ‌ద‌ని తెలిసినా.. వీటి గురించి అడిగేలా చేస్తున్న‌దెవ‌రు? జ‌గ‌న్ […]

ఏపీ కేబినెట్‌లో 5 గురు అవుట్ – 11 మంది ఇన్‌

యేడాదిన్న‌ర కాలంగా ఊరించి ఊరించి వ‌స్తోన్న ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న కూర్పు ఎట్ట‌కేల‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు ఖ‌రారు చేశారు. ఈ ప్ర‌క్షాళ‌న‌లో ముందు నుంచి అంద‌రూ ఊహిస్తున్న‌ట్టుగానే ఐదుగురు మంత్రుల‌కు చంద్ర‌బాబు ఉద్వాస‌న ప‌లికారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన పీత‌ల సుజాత‌తో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిమిడి మృణాళిని, చిత్తూరు జిల్లా నుంచి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా నుంచి రావెల కిషోర్‌బాబు, అనంత‌పురం జిల్లా నుంచి ప‌ల్లె ర‌ఘునాథ్‌రెడ్డిని త‌ప్పించారు. ఇక కొత్త‌గా […]