కొత్త జిల్లాల ఏర్పాటు అంశం.. మొత్తం మీద తెలంగాణ సీఎం కేసీఆర్ కు శిరోభారంగా మారినట్టే కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీల నేతలకు మైలేజీ రాకుండా చేయాలన్న ఉద్దేశంతో.. వారి డిమాండ్లనూ పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాల సంఖ్యను టీఆర్ ఎస్ అధినేత తాజాగా ఏకంగా 21కి చేర్చారు. అయినా ఈ అంశం రోజుకో వివాదాన్ని రాజేస్తూనే ఉంది. కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లను ప్రత్యేక జిల్లాగా చేయాలనే డిమాండ్తో మొదలైన ఈ […]
Category: Latest News
కేసీఆర్కు కొత్త తలనొప్పి…. 33 జిల్లాలు కావాలి
తెలంగాణ ను బంగారు తెలంగాణ చేయాలన్న టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహం కాస్తా.. తెలంగాణను జిల్లాల తెలంగాణగా మారుస్తోందా ? అనిపిస్తోంది! వాస్తవానికి పాలన సౌలభ్యం కోసం, ప్రజలకు మరింత చేరువ కావడం కోసం, కొత్త నాయకులు, నేతలు వస్తారని భావించిన కేసీఆర్ ప్రస్తుతమున్న పది జిల్లాల రాష్ట్రాన్ని 25 జిల్లాలు చేయాలని నిర్ణయించారు. వీటిలో ముఖ్యంగా పెద్ద పెద్ద జిల్లాలుగా ఉన్నవాటిపై ఆయన తొలుత దృష్టి పెట్టారు. ఇక, ఆ తర్వాత దీనికి […]
కేసీఆర్ ముందా వాళ్ల కుప్పిగంతులు
వర్తమాన రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుది విభిన్నశైలి. రాజకీయ ప్రత్యర్థులను.. ఎవరూ ఊహించలేని ఎత్తులతో చిత్తు చేయడమే కాదు. పరిపాలనలోనూ ఆయన తనదైన మార్కును చూపేందుకు ఇష్టపడతారు. అది ఏ అంశమైనా సరే… సాధ్యాసాధ్యాలకు ఆయన నిఘంటువులో అర్థాలు వేరుగా ఉంటాయి. ఆయన పాలనా పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా అందులో పార్టీకి భవిష్యత్తులో అనుకూలించే వ్యూహాలు అంతర్లీనంగా దాగి ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించిన తరువాత […]
2019లో వైకాపా పొత్తుల లెక్కలివే
కొంతకాలం కిందటిదాకా దేశవ్యాప్తంగా వామపక్షాలు అనేక రాష్ట్రాల్లో ఏదో ఒక స్థాయిలో తమ ప్రభావం చూపుతూ వచ్చాయన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇప్పుడంటే తమ ప్రభను కోల్పోయాయి కాని అధికారంలో ఉన్నపార్టీలపై కమ్యూనిస్టులు చేసే పోరాటాల ప్రభావం ప్రజలపై తీవ్రంగా ఉండేది. చాలా సమయాల్లో అధికార పక్షాలపై ప్రజావ్యతిరేకత పెంచి… ఆ తరువాత ఎన్నికల్లో వారిని అధికార పీఠానికి దూరం చేయడంలోనూ వామపక్షాలు ప్రధాన పాత్రనే పోషించాయి. అయితే పశ్చిమ బెంగాల్, కేరళ వంటి ఒకటి రెండు […]
ఏపీ సచివాలయం మూతేనా?
దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజలకు సేవలందించిన హైదరాబాద్లోని ఏపీ సచివాలయ భవనం ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దంతో బావురుమంటోంది! రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక సచివాలయం, అసెంబ్లీ భవనాలను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో గుంటూరులో అమరావాతి రాజధానితోపాటు వెలగపూడిలో ఏపీకి ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేశారు. మన ప్రాంతం మన పాలన పేరును పదే పదే జపిస్తున్న సీఎం చంద్రబాబు ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని సచివాలయాన్ని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయ […]
తనకు తానే సవాలు విధించుకున్న భూమా నాగిరెడ్డి
వైకాపా నుంచి జంప్ చేసి టీడీపీ సైకిల్ ఎక్కిన కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెద్ది తాజాగా పెద్ద సవాల్ చేశారు. ఇది వైకాపా ఎమ్మెల్యేలనో? ఆ పార్టీ అధినేత జగన్నో ఉద్దేశించి కాదు! తనకు తానుగానే రువ్వుకున్న సవాల్! విషయంలోకి వెళ్లిపోతే.. వైకాపా తరఫున 2014లో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు భూమా. అదేసమయంలో ఆయన కుమార్తె అఖిల ప్రియ తన తల్లి శోభప్లేస్ నుంచి గెలిపొంది అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే […]
ఏపీ విద్యాశాఖలో సున్నాలకు అవినీతి కన్నం!
విద్యార్థులకు నీతులు నేర్పి.. ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దే ఏపీ విద్యాశాఖ ఇప్పుడు అవినీతికి కేరాఫ్గా మారింది! అందిన ప్రతి అవకాశాన్ని అవినీతికి ఆలవాలంగా మార్చుకునేందుకు నేతల మొదలు అధికారులు సిద్ధమవుతున్నారు. సర్వశిక్షా అభియాన్ మొదలుకుని ప్రతి దాంట్లోనూ అవినీతి దందానే. ట్యాబ్ లు కొనుగోలు మొదలుకుని ‘సున్నాలు’ వేసే వరకూ ప్రతి స్కీమ్ లోనూ అవినీతి ‘గంటలు’ మోగుతున్నాయి. మొన్నామధ్య టీచర్ల బదిలీ వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే వార్తలు వచ్చినా ఏ ఒక్కరూ […]
జగన్ శత్రువు గెడ్డం దీక్షకు మోక్షం
వైకాపా అధినేత జగన్కు పొలిటికల్ రైవల్ కడప టీడీపీ యువ నేత శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి.. ఎట్టకేలకు తన గడ్డం దీక్షకు మోక్షం లభించడంతో ఆనందంతో ఊగిపోతున్నారు. తన దీక్ష ఫలించినందుకు పార్టీ చేసుకుంటున్నారు. ఇది తన ఒక్కడి విజయం కాదని, మొత్తంగా టీడీపీ విజయంగా ఆయన పేర్కొంటున్నారు. అదేసమయంలో వైఎస్ కు కంచుకోట వంటి పలివెందులలోనూ టీడీపీసైకిల్ రివ్వున సాగాలని, ఆదిశగా తాను మరిన్ని చర్యలు తీసుకుంటానని సతీష్ చెబుతున్నారు. ఈ […]
నయీం పేరుతో ఎమ్మెల్యే దందా
ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు తన మాట వినని వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన గ్యాంగ్ స్టర్ నయీంను పోలీసులు అంతమొందించినా.. అతని తాలూకా అనుచరుల ఆగడాలకు మాత్రం చెక్ పెట్టలేకపోతున్నారు. నయీంతో అంటకాగిన నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇంకా ఇప్పటికీ దందాలు సాగిస్తూనే ఉన్నట్టు పక్కాగా సీఎం కేసీఆర్కే సమాచారం అందిందంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో తెలుస్తోంది. నయీం అనుచరులుగా చక్రం తిప్పిన శేషన్న, నయీం బంధువు ఖలీంలతో ఈ ఎమ్మెల్యే […]