ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యేకు టీడీపీ ప్రజాప్రతినిధులు టీడీపీ మార్క్ ఝులక్ ఇచ్చారు. చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య తమ జిల్లాకు వస్తున్నాడని తెలిసినా ఎమ్మెల్యేలు మాత్రం ఆయన పర్యటనకు డుమ్మా కొట్టేశారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలే కాదు, బాలయ్య ఫ్యాన్స్ సైతం ఆయనకు షాక్ ఇచ్చారు. దశాబ్దాల పాటుగా బాలకృష్ణ అభిమాన నేతలుగా కొనసాగుతన్న వారు సైతం ఈ కార్యక్రమానికి రాకపోవడం ఇప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నుడా (నెల్లూరు […]
Category: Latest News
పరిటాల ఇంట పెళ్లి సందడి
దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్రకు తెలుగు గడ్డ మీద అదిరిపోయే క్రేజ్ ఉంది. అనంత ఫ్యాక్షన్ రాజకీయాల్లో ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన రవీంద్ర చివరకు ఆ ప్రత్యర్థుల చేతుల్లోనే హతమయ్యారు. ప్రస్తుతం రవి భార్య సునీత ఏపీ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఆమె తన తనయుడు శ్రీరామ్ను పొలిటికల్ ఎంట్రీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. రవికి ఉన్న క్రేజ్ను అంది పుచ్చుకుని కంటిన్యూ చేస్తోన్న శ్రీరామ్ ఇప్పటికే స్టేట్ […]
కేసీఆర్ కంచుకోటలో రాహుల్ పోటీ..!
తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అధికార టీఆర్ఎస్ను ఢీకొట్టడం అక్కడి రాజకీయ పక్షాల వల్ల అయ్యేలా లేదు. బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, వైసీపీ చేతులెత్తేయగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ముగ్గురు నాయకులు, ఆరు గ్రూపులతో విలవిల్లాడుతోంది. ప్రస్తుత పరిస్థితి కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా ? అన్న సందేహాలే అందరికి కలుగుతున్నాయి. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్కు సూపర్ బూస్టప్ ఇచ్చే […]
క్యాస్ట్ పాలిటిక్స్ వద్దంటోన్న జగన్
కుల రాజకీయాలపై వైసీపీ అధినేత వైఎస్.జగన్ ఆసక్తికరంగాను, సామరస్యపూర్వకంగాను మాట్లాడారు. కొద్ది రోజులుగా పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో దళితులకు, దళితేతరులకు మధ్య వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై చెలరేగిన గొడవ కాస్తా పెద్దదిగా మారిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన దళిత నాయకులు సైతం అక్కడకు చేరుకుని గరగపర్రులో బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ కోవలోనే వైసీపీ అధినేత వైఎస్.జగన్ సైతం శుక్రవారం గరగపర్రుకు వెళ్లి అక్కడ సాంఘిక […]
ఆ టీడీపీ ఎమ్మెల్యే ధ్యాసంతా జనసేనేనా!
ఏపీ రాజకీయాల్లో విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేరుకు కాస్త క్రేజ్ ఉంది. టీడీపీ తరపున ఉదయం మీడియా ఛానెళ్లలో ఆయన బాగానే హంగామా చేస్తారు. బొండా టీవీ చర్చలు చూసే వాళ్లలో చాలా మంది ఆయనకు మ్యాటర్ తక్కువ…మాటలు ఎక్కువ అని కూడా చమత్కరిస్తుంటారు. ఇక బొండా గెలవడానికి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినా నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినంత హడావిడి చేస్తుంటారు. గత మంత్రి వర్గ ప్రక్షాళనకు ముందు వరకు బొండా […]
నంద్యాల సీటుపై చంద్రబాబుకు అంత టెన్షన్ ఎందుకో?
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికపైటీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు భారీ ఎత్తున టెన్షన్ పడుతున్నారు. దీనిని ఛాలెంజ్గా తీసుకున్న బాబు.. అక్కడ గెలుపుకోసం అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వాస్తవానికి నంద్యాల ఉప ఎన్నికపై ఇంకా ఎలక్షన్ కమీషన్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. అయినా కూడా అటు అధికార, ఇటు విపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం, ప్రచారం తప్ప పంపాకాలు ప్రారంభించేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈవిషయంలో విపక్ష పార్టీని పక్కన పెడితే.. బాబు […]
జగన్ కోసం ఒక్కటైన తెర వెనక లీడర్లు..!
ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పడనుందా? 2019లో జగన్ సీఎం కల నెరవేరబోతోందా? అంటే.. ఇప్పుడు గ్యారెంటీగా ఔననే సమాధానమే వస్తోంది. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న దివంగత వైఎస్ మిత్రులు, సన్నిహితులు అందరూ జగన్కి జట్టుగా కలిసి రావాలని డిసైడ్ అయ్యారట. వైఎస్ అధికారంలో ఉండగా ఆయనతో ఎంతో చెలిమి చేసిన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు జగన్ని సీఎంని చేసే బాధ్యత తీసుకున్నారని, దీనివెనుక వైఎస్ ఆత్మ కేవీపీ ప్రధాన చక్రం […]
మీడియాకి కేటీఆర్ పాఠాలు.. నిజాలు చెప్పినందుకే!
తెలంగాణ మంత్రి కేటీఆర్ కొన్నిమీడియా సంస్థలపై నిప్పులు చెరుగుతున్నారు. పెయిడ్ ఆర్టికల్స్ రాస్తున్నాయని తెగ ఫీలైపోతున్నారు. అంతేకాదు, పత్రికా స్వేచ్ఛ అంటే ఏమిటో ఇప్పుడు గంటల తరబడి క్లాస్ పీకుతున్నారు. గతంలో టీఆర్ ఎస్కు అనుకూలంగా రాయని పత్రికలు పత్రికలే కావని, ప్రసారం చేయని మీడియా మీడియానే కాదని గులాబీ దళం తీర్మానించేసింది. అప్పట్లో టీఆర్ ఎస్ని, కేసీఆర్ని పొడుగుతూ పత్రికలు రాసిన కథనాలు, వెలువరించిన వార్తలు పెయిడ్ న్యూస్గా కనిపించని కేటీఆర్కి.. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా […]
పవన్ దానినుంచి అయితే తప్పించుకున్నాడు…మరి రేపు
ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్కళ్యాణ్ పోటీకి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కులాల లెక్కనే ఎక్కువుగా నడుస్తున్నాయి. ఈ ట్రెండ్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా ఉంటుంది. ఏపీలో 2009లో ప్రజారాజ్యం పార్టీ ఎంట్రీ ఇవ్వడంతో కులాల ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. టీడీపీకి కమ్మ, బీసీ వర్గాలు, కాంగ్రెస్కు రెడ్డి, ఎస్సీ వర్గాలు, ప్రజారాజ్యానికి కాపు వర్గం ఎక్కువుగా మద్దతు ఇచ్చాయి. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ […]
