ఎర్రబెల్లి దయాకరరావు. పేరు చెప్పగానే గుర్తొచ్చే నేతల్లో ఈయన ఒకరు. తెలంగాణలో ఒకప్పుడు టీడీపీకి అంతాతానై వ్యవహరించిన వరంగల్ జిల్లాకు చెందిన నేత. పాలకుర్తి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకును కూడా సిద్ధం చేసుకున్న ఈయన.. టీడీపీకి ఒకప్పుడు వీర విధేయుడు! ముఖ్యంగా చంద్రబాబు విధానాలు, టీడీపీ సిద్ధాంతాల కోసం కష్టపడ్డాడు. అయితే, రోజులు మారతాయి అన్నట్టు స్టేట్ విభజన నేపథ్యంలో చంద్రబాబు ఏపీకే పరిమితం అవడం, తెలంగాణలో టీడీపీ నానాటికీ తీసకట్టుమాదిరిగా మారిపోవడం తెలిసిందే. […]
Category: Latest News
ఏపీలో వైసీపీ ముందస్తు వ్యూహం
ఏపీ పాలిటిక్స్లో నిన్నటి వరకు కాస్త స్తబ్దుగా ఉన్న ప్రతిపక్ష వైసీపీ దూకుడు పెంచుతోంది. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల టైం ఉన్నా ఒకవేళ ఆరు నెలల ముందుగా ఎన్నికలు వచ్చినా విజయం సాధించేలా పోరాటానికి సమాయత్తమవుతోంది. ఈ క్రమంలోనే జగన్ పార్టీ పటిష్టతకు, ఏపీలోని 175 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం సరికొత్త ప్లాన్తో ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ నియోజకవర్గ, జిల్లా స్థాయి, స్టేట్ స్థాయి ప్లీనరీల నిర్వహణ ప్లాన్ […]
ఏపీలో తాజా పరిణామాలు రాజకీయ వ్యూహాత్మకమా ..!
జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్లో కూరలో ఓ కరివేపాకు చందంగా మారాడా ? అంటే తాజాగా ఏపీలో రాజకీయ పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. అసలు పవన్ రాజకీయ లక్ష్యం ఏంటి ? పవన్కు రాజకీయాల్లో రాణించాలన్న క్లారిటీ ఉందా ? లేదా ? పవన్కు సినిమాలు ముఖ్యమా ? రాజకీయాలు ముఖ్యమా ? అన్నదే ఇప్పుడు అందరి మదిలోను పెద్ద కన్ఫ్యూజన్గా మారుతోంది. పవన్ కాటమరాయుడు తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో నటిస్తున్నాడు. ఈ సినిమా […]
పత్తికొండలో యువ రాజకీయం
కర్నూలు జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటి అయిన పత్తికొండ రాజకీయం మారుతోంది. తాజాగా వైసీపీ పత్తికొండ ఇన్చార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య తర్వాత ఇక్కడ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. నారాయణరెడ్డి హత్య తర్వాత జగన్ వచ్చే ఎన్నికల్లో ఆయన భార్య శ్రీదేవికి టిక్కెట్టు ఇస్తానని, ఆమె ఇక్కడ నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రకటించారు. జగన్ ప్రకటనతో పత్తికొండలో వైసీపీ తరపున కొత్త వ్యక్తికి చోటు ఇచ్చినట్లయ్యింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టీడీపీ తరపున […]
రాయలసీమలో వైసీపీకి క్యాండెట్స్ కొరత
రాయల సీమ! వైసీపీ అధినేత జగన్కి సొంత ప్రాంతం. ఈ ప్రాంతం జగన్కి కంచుకోట అనే అనుకుంటారు ఎవరైనా! అయితే, పరిస్తితి అందుకు భిన్నంగా ఉంది. జగన్ ఇప్పుడు ఇక్కడ తన ప్రాబల్యాన్ని కోల్పోతున్నారట! కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో జగన్ హవా సాగుతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ, పరిస్థితి ఇందరు భిన్నంగా ఉందట. ఈ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలకు ఇంచార్జులు కూడా లేరట. నిజానికి గత 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లాను మినహాయిస్తే మిగతా […]
టీఆర్ ఎస్లో సర్వే మంటలు.. ప్రజాదరణ కోల్పోతున్న నేతలు
2014లో ఓ ప్రభంజనం మాదిరిగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ పార్టీకి ముచ్చటగా మూడేళ్లు పూర్తయ్యాయి. మరో రెండేళ్లలో 2019 ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ ఇప్పటి నుంచే తన సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అదేసమయంలో ప్రజల్లో అధికార పార్టీకి, నేతలకు ఉన్న బలాబలాలను, అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో నే ఇటీవల నేతల పనితీరు ఆధారంగా సర్వే చేయించారు. గతంలోనూ ఒకసారి ఈ […]
నందమూరి కుటుంబాన్ని వదిలేస్తే.. బాబుకు కష్టమే!!
నందమూరి కుటుంబానికి, టీడీపీ సీఎం చంద్రబాబుకి మధ్య దూరం పెరుగుతోందా? ముఖ్యంగా టీడీపీకి 2009లో భారీ ఎత్తున ప్రచారం చేసి పెట్టిన ఎన్టీఆర్ మనవడు, జూనియర్ ఎన్టీఆర్ని సైతం బాబు దూరం పెడుతున్నారా? భవిష్యత్తులో వారితో అవసరం లేదని బాబు భావిస్తున్నారా? ఇప్పుడు ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయట టీడీపీ కేడర్లో! దీనికి ప్రధాన కారణం.. నిన్న విశాఖ కేంద్రంగా ప్రారంభమైన మహానాడేనని చర్చిస్తున్నవారు చెబుతున్నారు. మరి విషయం ఏంటో చూద్దాం. టీడీపీ మహానాడు శనివారం విశాఖలో ఘనంగా […]
వైసీపీలోకి కోట్ల ఫ్యామిలీ….జగన్ రెండు ఆఫర్లు
రాయలసీమలోని కర్నూలు జిల్లాలో గత దశాబ్దంన్నర కాలంగా టీడీపీ అష్టకష్టాలు ఎదుర్కొంటోంది. వైఎస్ గాలిలో 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ దూకుడు ముందు టీడీపీ తేలిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీ టీడీపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. వైసీపీ దూకుడుతో టీడీపీ కేవలం మూడు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలిచింది. పత్తికొండ నుంచి సీనియర్ రాజకీయ దిగ్గజం కేఈ.కృష్ణమూర్తి, బనగానపల్లి నుంచి బీటీ.జనార్థన్రెడ్డి, ఎమ్మిగనూరు నుంచి జయనాగేశ్వర్రెడ్డి విజయం సాధించారు. వైసీపీ 11 ఎమ్మెల్యేలతో పాటు కర్నూలు, […]
తన సర్వేతో.. హరీశ్ని వెనక్కి నెట్టిన కేసీఆర్
తెలంగాణ అధికార పార్టీలో ఒకే కుటుంబం నుంచి మంత్రులుగా ఉన్న వారు కేటీఆర్, హరీశ్రావు. ఇద్దరూ కూడా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కి ఒకరు కొడుకు, మరొకరు మేనల్లుడు! అయితే, ఇటవల కాలంలో హరీశ్ రావు హవా పెరుగుతోందని కొన్ని ప్రైవేటు సర్వేలు చాటాయి. దీనికి మిషన్ భగీరథ, కాకతీయ మిషన్ వంటి కార్యక్రమాలు భారీగా తోడ్పడ్డాయని కూడా కథనాలు వచ్చాయి. ఇక, అదేసమయంలో.. కేసీఆర్ కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ఒకింత వెనుకబడ్డారనే వార్తలు వచ్చాయి. […]