వెనక్కి వెళ్లిన వివేకా హత్య కేసు..!

మామూలుగా అయితే శాసనసభ జరుగుతూ ఉండగా.. ఇటీవలి సంఘటనలను పరిణామాలను అన్నిటినీ బేరీజు వేసుకుంటే వివేకా హత్యకేసపు విషయంలో మాజీ డ్రైవరు దస్తగిరి వాంగ్మూలం, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు శంకరరెడ్డి అరెస్టు అనే వ్యవహారాలు సభలో అట్టుడికిపోతుండాలి. రాష్ట్రవ్యాప్తంగా కూడా విపక్షాల వారు అందరూ ఆ విషయాల గురించే గోలచేస్తూ ఉండాలి. కానీ ఆ చర్చ మొత్తం హైజాక్ అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలు మాట్లాడుకునే ఏ ఇద్దరు కలిసినా చంద్రబాబు గురించే మాట్లాడుకుంటున్నారు. […]

వైసీపీ భ్రష్టుపట్టడానికి కొడాలినాని ఒక్కడు చాలు..!

రాజకీయాల్లో విమర్శలు చాలా సహజం. అయితే ఈ విమర్శలు అనేవి అంశాలవారీగా ఉండాలి.. ప్రభుత్వ నిర్ణయాల మీద, ప్రతిపక్షాల వ్యవహార సరళిమీద ఉండాలి అనే తరహా రాజకీయ విలువలు ఎప్పుడో మంటగలిసిపోయాయి. ఇప్పుడంతా తిట్ల పర్వమే నడుస్తోంది. ఒకరినొకరు తిట్టుకోవడం, వ్యక్తిగత తిట్లు ఇవన్నీ కూడా చాలా సహజపరిణామాలుగా వచ్చేశాయి. వీటన్నింటినీ కూడా భరించవచ్చు గానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొడాలి నాని తిట్టే తిట్లను వినడం కూడా సాధ్యం కాదు. మామూలుగానే కొడాలి నాని […]

చెప్పినట్టుగా చెప్పారు.. విన్నట్టుగా విన్నారు..

కొట్టినట్టుగా కొడితే.. ఏడిచినట్టుగా ఏడ్చారనే సామెత ఒకటి తెలుగునాట ఉంది. చిత్తశుద్ధి లేకుండా చేసే పనులకు ఈ సామెత అతికినట్టుగా సరిపోతుంది. తాజాగా ఏపీలో అమరావతి రాజధాని కోసం సాగుతున్న పోరాటానికి భారతీయ జనతా పార్టీ క్రియాశీలంగా అండగా నిలుస్తుందా లేదా అనే సంగతి.. ఈ సామెతకు సరిపోయేలా ఉంది. అమరావతి రాజధాని పోరాటానికి పార్టీ నాయకులంతా మద్దతు ఇచ్చి తీరాల్సిందే అని అమిత్ షా తిరుపతి సమావేశంలో హూంకరించినట్టుగాను, అందరూ అందుకు సమ్మతించినట్టుగానూ వార్తలు వచ్చాయి. […]

ఈటలకు ఉన్న విలువ చంద్రబాబుకు లేదేం?

కుప్పంలో ఓడిపోయిన తర్వాత.. తెలుగుదేశం శ్రేణుల ఆత్మవంచన డైలాగులు మిన్నంటుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం మునిసిపాలిటీని ఎలా చేజిక్కించుకున్నది అనే విషయంలో ఎన్నెన్ని నిందలు వేయాలో అన్నీ వేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ గనుక.. వారు అన్ని రకాల దుర్వినియోగాలకు పాల్పడ్డారని, పోలీసు బలగాలను తమకు అనుకూలంగా వాడుకున్నారని, విచ్చలవిడిగా డబ్బు పంచారని, దొంగఓట్లు వేయించిరని, రౌడీలను మోహరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఉండవచ్చు గాక.. కానీ.. కుప్పం […]

వైసీపీ ఎమ్మెల్యేలపై జనం మంటెత్తి ఉన్నారా?

మునిసిపాలిటీ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేయడానికి- వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, ఆ సీట్లో కొనసాగడానికి సంబంధం లేదనే సంగతి ప్రజలకు చాలా బాగా తెలుసు. అందుకే సాధారణంగా ఇలాంటి స్థానిక ఎన్నికలను పార్టీల కంటె కూడా, స్థానికంగా నాయకుల సొంత బలం, వారి పరిచయాలు ప్రభావితం చేస్తుంటాయి. కానీ ఈ ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇదంతా కూడా జగన్మోహన రెడ్డి సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలకు దక్కిన ప్రజల […]

పాపం బాబు.. పోరాడుటయా? పారిపోవుటయా?

కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలలో పరాజయం తప్పదని చంద్రబాబునాయుడుకు చాలా కాలం ముందే తెలుసు. స్థానిక పరిస్థితులను ఆయన సరిగానే పసిగట్టారు. ఓటమి తప్పదని గ్రహించగలిగారేమో గానీ.. ఫలితం ఇలా ఉంటుందని, ఇంత ఘోరమైన అవమానకరమైన ఓటమి ఎదురవుతుందని ఆయన అనుకుని ఉండకపోవచ్చు. 25 వార్డుల్లో కేవలం ఆరు మాత్రమే గెలుచుకుని పార్టీ కుదేలైపోయింది. పరువు గంగపాలు అయింది. కిం కర్తవ్యం? ఏం చేయాలి? చంద్రబాబునాయుడు ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇది. బహుశా ఈ సమయానికి ఏం చేయగలడో […]

’బండి‘కి బ్రేకులు వేయలేకపోతున్న ’కారు‘

భారతీయ జనతా పార్టీ.. ఎప్పుడూ ఉత్తర భారతదేశంలోనే దీని హవా.. దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే.. ఇది గతం.. ఇప్పుడు సౌత్ లో తెలంగాణలో దూసుకుపోతోంది. ఎప్పుడూ మూడో స్థానంలో ఉండే బీజేపీ ఇపుడు అధికార పార్టీకి ఏకుమేకై కూర్చుంది. గతంలో అధికార పార్టీ తరువాత కాంగ్రెస్ మాటలు వినిపించేవి. ఇపుడు బీజేపీకి ఆ అవకాశం దక్కింది. అందుకు నిదర్శనమే సీఎం కేసీఆర్ మీడియా సమావేశం. రాష్ట్రంలో ఉన్నది కేవలం తమ పార్టీనేనని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ […]

ఆ నలుగురికీ స్పెషల్ క్లాస్!

విద్యార్థులు అందరికీ కలిపి పాఠం చెబితే అది క్లాసు. కొందరు మొద్దు విద్యార్థులను లేదా కొందరు అత్యంత ఇంటెలిజెంట్ విద్యార్థులను ప్రత్యేకంగా పరిగణించి.. వారి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి వారికి విడిగా పాఠం చెబితే అది స్పెషల్ క్లాస్. రాష్ట్ర బీజేపీ నాయకులతో ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందరికీ ఉమ్మడిగా క్లాస్ తీసుకుంటే.. ఆ నలుగురికి మాత్రం స్పెషల్ క్లాస్ తీసుకున్నారుట. నాయకులు కంగారెత్తిపోయేలా.. మాట్లాడారట. ఇంతకీ ఆ నలుగురు […]

మధ్యలో దూరితే.. నమ్మేదెవరు?

అమిత్ షా.. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక దారి చూపించాడు. రాష్ట్రంలో పార్టీ బలం పెంచుకోవడం లక్ష్యం. అందుకోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పోరాటాలు జరుగుతూ ఉంటే వాటన్నింటిలోనూ తలదూర్చమని ఆయన చెప్పాడు. ప్రజలు దేనికోసం ఉద్యమిస్తున్నా సరే.. వారి వెన్నంటి ఉండమని అన్నాడు. ఆ కోటాలో భాగంగానే.. అమరావతి రాజధాని పోరాటంలో భాగం పంచుకోవాలని అనడం కూడా. అమరావతి రాజధాని కోసం రైతులు మహాపాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో.. ఆ పాదయాత్ర తీవ్రత ఏదో […]