ఈ మధ్యకాలంలో అమ్మాయిలు అందంగా కనిపించడానికి ముఖానికి ఎలాంటి ప్రొడక్ట్స్ వాడుతున్నారో మనం చూస్తున్నాం .. చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు ..డబ్బులు ఉన్నవాళ్లు డబ్బులు లేనివాళ్లు రకరకాల ప్రోడక్ట్స్ ని పౌడర్స్ ని ముఖానికి రాసుకుంటూ ఉన్న అందాన్ని కూడా చెడగొట్టుకుంటున్నారు . అయితే అలా కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు నిపుణులు . మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ మంచి కన్నా చెడు చేస్తాయి అంటూ హెచ్చరిస్తున్నారు.
అయితే పాతకాలం పద్ధతులను ఎక్కువగా ఉపయోగించడం మేలు శ్రేయ శకరం అంటున్నారు . అందరూ అమ్మాయిలు ఈ మధ్యకాలంలో ముఖానికి రకరకాల క్రీమ్స్ ..సిరమ్స్.. పౌడర్స్.. మాయిశ్చరైజర్స్.. లొషన్స్ ఎక్కువగా రాస్తున్నారు అని ..వీటన్నిటికన్నా సున్నిపిండితో స్నానం ముఖానికి పసుపు రాసుకోవడం చాలా చాలా మేలు అని పూర్వం అందరూ ఇదే విధంగా ఫాలో అయ్యేవారు అని .. అందుకే అప్పట్లో ఆడవాళ్లకు ఎక్కువగా రోగాలు వచ్చేటివి కావు అని ఇప్పుడు రకరకాల మందులతో ట్రీట్మెంట్లతో ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతూ ఆడవాళ్లు సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు అని చెప్పుకొస్తున్నారు నిపుణులు.
అందుకే వేలు వేలు ఖర్చు చేసి చెత్త ప్రొడక్ట్స్ వాడడం కన్నా చాలా పద్ధతి కల పాత సాంప్రదాయాలను అలవాటు చేసుకోవడం మేలు..పాలు సున్నిపిండి.. కుంకుమపువ్వు పాలు.. పసుపు పాలు ఇలా ముఖానికి రాసుకోవడంతో ముఖం తల తల మెరిసిపోతుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు. మరి ఎందుకు ఆలసయం అమ్మాయిలు..ఇప్పుడే ఇంట్లో ఉన్న పసుపు పాలను కలిపి ముఖానికి రాసుకోండి..మీ అందానీ పెంచుకోండి..!!