అనుపమ పరమేశ్వరణ్.. ఈ మధ్యకాలంలో ఈ పేరు ఎలా మారు మ్రోగిపోయిందో ట్రోలింగ్కి గురైందో.. బూతులు తిట్టించుకుందో.. మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ట్ల్లు స్క్వేర్ . వామ్మో అది అనుపమనేనా ..? అనే రేంజ్ లో షాక్ అయిపోయారు అభిమానులు. కొంతమంది అభిమానులు డైరెక్ట్ గా ఆమెకు వీడియో పోస్ట్ చేస్తూ దయచేసి ఇలాంటివి చెయ్యొద్దు .. నిన్ను మహానటి సావిత్రి అనుకున్నాము.. నువ్వు సన్నిలియోన్ లా..ఎక్స్పోజ్ చేస్తున్నావే అని ఓపెన్ గా చెప్పుకొచ్చారు .
అనుపమ పరమేశ్వరణ్ కి సంబంధించిన మరొక వార్త వైరల్ గా మారింది . అనుపమ పరమేశ్వరణ్ మరొకసారి బోల్డ్ రోల్ లో కనిపించబోతుందట . అనుపమ పరమేశ్వరన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఒక సినిమా చేసింది . ఆ సినిమాలో చాలా డీసెంట్ లుక్స్ లో కనిపించింది . రాక్షసుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే ఈ సినిమా విజయం సాధించిన తర్వాత అనుపమ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబోలో మరో సినిమా రావాల్సింది.
కొన్ని కారణాల చేత అది ఆగిపోయింది . అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ కాంబోలో ఒక సినిమా రాబోతుంది అంటూ సమాచారం అందుతుంది . వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ డైరెక్టర్ మురళీ కిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుందట . ఈ సినిమాలో అనుపమ హీరోయిన్గా నటించబోతుందట . ఈ సినిమాకు కిష్కిందపురం అనే టైటిల్ కూడా పెట్టారట . సాయి శ్రీనివాస్ ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటాడు అంటున్నారు అభిమానులు .చూద్దాం మరి ఏం జరుగుతుందో..???