2012లో పోడాపోడి అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. స్టార్ హీరో శరత్ కుమార్ నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే మొదట్లో తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకు ఊహించిన రేంజ్ లో సక్సెస్ వరించలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా రాణించింది. ఎన్నో అద్భుతమైన సినిమాలో అవకాశాలు అందిపుచ్చుకుంటూ తానేంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ఉంది.
తెలుగు తో పాటు తమిళ్, మలయాళ, కన్నడ సినిమాలోని నటిస్తూ ఫుల్ క్రేజీగా దూసుకుపోతున్న ఈ అమ్మడు.. పర్సనల్ లైఫ్ లోను ఇక సెటిలా అవాటని డిసిషన్కు వచ్చింది. ఇటీవలే తన ప్రియుడితో ఘనంగా నిశ్చితార్థ వేడుకలు చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. అయితే పెళ్లికి ముందే వీరిద్దరూ తమ పిల్లల పుట్టిన రోజులు గ్రాండ్గా జరిపారు. వీళ్ళిద్దరూ పిల్లలు అంటే పిల్లలు కాదు విళ్ళు ప్రాణానికి ప్రాణంగా పెంచుకొని రెండు కుక్కపిల్లలు. అయితే ఇటీవల ఈ రెండిటి పుట్టినరోజును ఒకే రోజు క్యూట్ గా సెలబ్రేట్ చేసింది వరలక్ష్మి.
ఈ వేడుకకు తనకు కాబోయే భర్త నికోలయి సచ్దేవ్ను పిలిచి సందడి చేసింది. మార్చి 25వ తేదీన మూడేళ్లు పూర్తి చేసుకున్న గుక్కి, ఏప్రిల్ 2 న ఏడాది పూర్తి చేసుకున్న జారా లతో ఒకేరోజు కేక్ కట్ చేయించి బర్త్డే సెలబ్రేషన్ ఫొటోస్ తో పాటు ఎమోషనల్ నోట్ షేర్ చేసుకుంది. ఆ రెండు కుక్క పిల్లల రెండు కళ్ళు అంటూ చెప్పుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన పిల్లల పుట్టినరోజు వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram