గీతగోవిందం లాంటి ఆల్టైమ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ పరశురాం కాంబోలో వస్తున్న మూవీ ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ రిలీజై సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి.. దీంతో మూవీ పై సూపర్ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీ ఏప్రిల్ 5న గ్రాండ్గా రిలీజ్ కానుంది. తమిళ వెర్షన్ కూడా అదే రోజు రిలీజ్ చేయనున్నారు. ఇక ఫ్యామిలీ స్టార్ రషెస్కు ఇంప్రెస్ అయిన సినీ లవర్స్ అంతా ఎప్పుడెప్పుడా అంటూ అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో అలాంటి వారికోసం హైదరాబాద్లో మార్నింగ్ షోలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ షురూ చేశారు. ఎర్లీ మార్నింగ్ షోలు ఉదయం 7:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. సినిమాను వెంటనే చూడాలనుకునే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కు మాత్రం ఇది సూపర్ న్యూస్ అని చెప్పొచ్చు. త్వరలోనే మరిన్ని షోలు యాడ్ చేయనున్నారట మేకర్స్.
ఇక ఫ్యామిలీ స్టార్ పాపులర్ డిజిటల్ ప్లాట్ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోస్ట్ థ్రియాట్రికల్ రిలీజ్ కాబోతున్నట్టు మేకర్స్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతం అందించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షో లను అమెరికాలో మొదలుపెట్టడానికి అన్ని సనాహాలు జరిగిపోయాయి. ఈ క్రమంలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీ రేంజ్లో దూసుకుపోతున్నాయి.