చిరంజీవి పునాదిరాళ్ళు సినిమాతో టాలీవుడ్లో హీరోగా పరిచయమై అప్పటినుంచి నాలుగు దశాబ్దాలుగా తెలుగులో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. ఇప్పటికీ అదే ఉత్సాహంతో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సీనియర్ హీరోల్లో బిజీగా ఉంటూ వరుస సినిమాలో చేస్తుంది మాత్రం చిరంజీవి ఒక్కడే.. చిరంజీవి తన సినిమాల విషయంలో ఎంచుకునే కథలపై ఎంతో అపారమైన జడ్జిమెంట్ ఉంది. ఇక తన సినిమాల షూటింగ్ సెట్లో కొన్నిసార్లు ఆపధర్మ దర్శకుడుగా కూడా చిరు అవతారం ఎత్తారు.
రాబోయే భవిష్యత్తులో చిరంజీవిని దర్శకుడుగా కూడా చూసే అవకాశం ఉందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇక సంక్రాంతి కానుకగా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నవాల్తేరు వీరయ్య ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దర్శకత్వం గురించి ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావన రాగా.. చిరంజీవి దాని గురించి స్పందిస్తూ.. జీవితాంతము సినిమాలతోనే ఉండాలని భావిస్తున్నాను.. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తానన్న నమ్మకం నాకు వచ్చి, ఆ అవకాశం కూడా కుదిరితే తప్పకుండా చేస్తానేమో.. అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం విడుదల కాబోతున్న వాల్తేరు వీరయ్య సినిమాపై చిరు ఎంతో గట్టి నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా గురించి ఏ ఫంక్షన్ లో అయిన ఎంతో పాజిటివ్గా స్పందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నా అభిమానులు ఏం కోరుకుంటున్నారో అవన్నీ ఎంతో పుష్కలంగా దర్శకుడు సమకూర్చాడు. ఈ సినిమా సంక్రాంతికి ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమాను బాబీ తెరకెక్కించగా చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటించింది. రవితేజ ఓకీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.