భారత్కు చెందిన పైలెట్ పాక్ కస్టడీలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్గా మారుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టర్ జనరల్.. లెఫ్ట్నెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి రియాక్ట్ అయ్యాడు. మా అధీనంలో ఇండియన్ పైలెట్ ఎవరూ లేడని క్లారిటీ ఇచ్చారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఈ క్లారిటీ ఇచ్చిన షరీఫ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవన్నీ ఫేక్ వార్తలేనని క్లారిటీ ఇచ్చాడు. బలుచిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలకు భారత్ కారణమని షరీఫ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. అంతేకాదు.. పాకిస్తాన్ ఎప్పుడు కాల్పుల విరమణ కోసం అడుక్కోలేదంటూ మాట్లాడాడు. భారత్ కాల్పుల విరమణకు ముందుగా పిలుపునిచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.
మే 6, 7 తేదీల్లో పాక్పై దారుణమైన పిరికితనంతో కూడిన దాడులు జరిగాయని కామెంట్స్ చేసిన షరీఫ్.. తర్వాత ఇండియానే సీజ్ఫైర్ కోసం అభ్యర్థించిందని.. తాము ప్రతిదాడులు చేశాకే.. మాట్లాడతామని.. మేము చెప్పామంటూ వివరించాడు. పరస్పర చర్చలు కొనసాగిన తర్వాత మే 10న సీజ్ ఫైర్ కు అంగీకరించామంటూ వెల్లడించాడు. భారత్ జరిపిన దాడులకు ప్రతీకారం తీర్చుకున్నామని షరీఫ్ వెల్లడించాడు. పాక్పై భారత్ చేసిన దాడులకు కచ్చితంగా ప్రతి కారం తీర్చుకుని.. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకున్నామంటూ పేర్కొన్నాడు. ఇండియాలోని 26 సైనిక స్థావరాలను ధ్వంసం చేసామని వెల్లడించిన షరీఫ్.. ఢిల్లీ సహా ఇతర నగరాల్లో డ్రోన్లు పంపించామని ఫయాజ్, నగ్రోటాల్, బ్రహ్మాస్ క్షిపణి స్టోరేజ్ ఫెసిలిటీలు అన్నింటిని ధ్వంసం చేసేసామని.. s – 400 క్షిపణిన బ్యాటరీలను న్యూట్రలైజ్ చేసామని వెల్లడించాడు.
ఇక కాల్పుల విరమణ పై ఆయన రియాక్ట్ అవుతూ పాకిస్తాన్ సైన్యం ఈ కాల్పుల ఉల్లంఘనకు అసలు పాల్పడలేదంటూ.. అహ్మద్ షరీఫ్ చెప్పుకొచ్చాడు. ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామంటూ వివరించాడు. 200% కచ్చితంగా దీనిని చెప్పగలనని.. తమది ఒక ప్రొఫెషనల్ ఆర్మీ అంటూ వివరించాడు. ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తామని.. మాది శాంతిని కోరుకునే దేశం అంటూ పేర్కొన్నాడు. కానీ.. దాడి జరిగితే మేము ప్రతి దాడి చేస్తాం అంటూ వ్యాఖ్యానించాడు. కాగా.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ భారీ నష్టాలను చెవి చూసిన సంగతి తెలిసిందే.