తాజాగా ఇండియన్ త్రివిధ దళాలు పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా పాకిస్తాన్కు ఇప్పటివరకు మనం చూపించింది కేవలం ట్రైలర్ అని.. మళ్ళీ తోక జాడిస్తే అసలు విశ్వరూపం చూపిస్తామంటూ క్లారిటీ ఇచ్చి.. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టామని చెప్పుకొచ్చారు. భారత సైన్యం ఉగ్రస్థావరాలను గుర్తించి అంతం చేయడమే లక్ష్యంగా దీనిని చేపట్టామని.. 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తామని.. కొంతమంది ఉగ్రవాదులు అంతమయ్యారంటూ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక మీడియా సమావేశాలను ఏర్పాటు చేసిన త్రివిధ దళాధికారులు.. ఆపరేషన్ పై కీలక వివరాలను చెప్పుకొచ్చారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఐదు, పాకిస్తాన్లో నాలుగు ఉగ్ర శిబిరాలను నెల మట్టం చేశామని.. దాడులు చేస్తున్నామన్న భయంతో పాక్ ఉగ్ర శిబిరాలు ఖాళీ అవుతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు.
సరిహద్దు అవతల ఉన్న ఉగ్ర శిబిరాలను కచ్చితంగా ఆధారాలతో గుర్తించి దాడులు చేశామని వివరించిన సైన్యం.. అందుకు సంబంధించిన మ్యాప్స్, ఫోటోలను రిలీజ్ చేశారు. భారత్ దాడులతో వణికిపోయినా పాకిస్తాన్.. మనదేశంలో పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతుందని.. శత్రుదేశం అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ వివరించారు. 8,9 లో భారత్ పై గగనతల దాడికి పాకిస్తాన్ ప్రయత్నించి విఫలమైందని.. డ్రోన్లు, మానవ రహిత విమానాలను భారత్ పై ప్రయోగించారు.. వాటన్నింటినీ భారత్ గగనతలంలోనే కూల్చివేసిందని పేర్కొన్నారు. పాక్ డ్రోన్ దాడులకు కౌంటర్గా పాక్కు.. రాడార్ స్టేషన్లు, సైనిక స్థావరాలపై బలమైన దాడులు చేసిన భారత్.. మూడు రోజులపాటు కొనసాగింపు దాడుల్లో 35 నుంచి 40 మంది పాకిస్తాన్ సైనికులను మట్టుపెట్టినట్లు అంచనా వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇక మే 7 నుంచి పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్లో భారతదేశానికి చెందిన ఐదుగురు సైనికులు అమరవీరులయ్యారని.. భారత త్రివిధ దళాలు వెల్లడించాయి. ఇక పాక్ పౌరులను లక్ష్యంగా పెట్టుకుని భారత్ ఎప్పుడు దాడులు చేయలేదని.. కానీ పాకిస్తాన్ మాత్రం భారత నగరాలే లక్ష్యంగా దాడులకు తెగబడుతుందని.. భారత వాయిసేన, క్షిపణి రహస్య ఆస్తులపై.. స్పష్టమైన మెసేజ్ ఇచ్చింది. భారత సైన్యం దుస్సాహాసానికి పాల్పడితే ఎంత పర్యావసనాలు అయినా ఎదురుకోక తప్పదని ప్రత్యక్షంగా తెలుసుకుంది. ఇక పాక్ ప్రతిపాదన మేరకు కాల్పులు విరమణకు భారత్ అంగీకరించిందని.. మళ్లీ తోకజాడిస్తే సరైన సమాధానం చెప్తానికి సైన్యం, వాయిసేనకు అనుబంధంగా అరేబియా సముద్రంలో నౌకాదళం సిద్ధంగా ఉందంటూ వెల్లడించారు.