ఆపరేషన్ సింధుర్ తర్వాత.. ఇండియా, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను ఆపాలని.. అమెరికా జోక్యం చేసుకొని మరి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. రెండు దేశాలు కూడా దీనిని ధ్రువీకరించాయి. అయితే.. కాల్పులు విరమణను ధ్రువీకరించిన కొంత సేపటికే.. పాక్ దానిని బ్రేక్ చేసి వక్ర బుద్ధి చూపించింది. శనివారం అర్ధరాత్రి జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్లతో దాడికి దిగింది. దానికి దిటుగా భారత బలగాలు వాటికి సమాధానం ఇచ్చాయి.
అటు ఆదివారం కూడా రాజస్థాన్ భారాముల్లాలోనూ పాక్ డ్రోన్ కనిపించడం అందరిని భయభ్రాంతులను చేసింది. భారతదేశ సైన్యం.. దానిని గగనతలంలోనే కూల్చేసింది. దీనిపై జిల్లా కలెక్టర్ రియాక్ట్ అవుతూ స్థానికులు ఎవరు ఇంట్లో నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. అక్కడ ఇంకా అలర్ట్ కొనసాగుతూనే ఉంది. కాగా.. జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దుల్లో కూడా ఆదివారం పాక్ దాడులకు పాల్పడిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
దీనిపై కేంద్రం రియాక్ట్ అవుతూ క్లారిటీ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్లో కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లు మాత్రమే కనిపించాయని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్లు అన్ని ఫేక్ అని.. వాటిని నమ్మకండి, భయపడకండి అంటూ చెప్పుకొచ్చింది. జమ్మూ కాశ్మీర్లో డ్రోన్ కార్యకలాపాలు లేవని వివరించింది. ఇక ఉద్దమ్పూర్లో భారీ పేలుళ్లు జరిగాయ అనే వాదనలు పూర్తిగా అబద్ధమని క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. వాటిని నమ్మవద్దని పేర్కొంది.