ఆపరేషన్ సింధుర్ ఆగేదే లేదు.. POKను మాకు అప్పగించాల్సిందే.. మోడీ

పహ‌ల్గాం దాడితో ఇండియాను రెచ్చగొట్టిన పాక్‌పై ఆపరేషన్ సింధూర్ తో ప్రతీకార చర్య ప్రారంభించింది భారత్. ఈ క్రమంలోని 9 ఉగ్ర స్థావరాలను కుప్పకూల్చేయడంతో.. పాక్ ప్రతిదాడికి దిగింది. భారత సైనిక స్థావరాలపై మిస్సైళ్లు, డ్రోన్‌ల‌తో దాడులు చేయగా.. భారత్ వాటిని సమయస్ఫూర్తితో తిప్పికొట్టింది. గ‌గ‌న‌త‌లంలోనే వాటిని మ‌ట్టుపెట్టింది. ఈ క్రమంలోనే భార‌త్, పాకపై యుద్ధానికి పాల్ప‌డ‌ట్.. ఇలా భారత్, పాక్‌.. నిరంత‌ర దాడుల నేపద్యంలో.. బోర్డర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

కాగా తాజాగా ఈ ఇరు దేశాలు కాల్పుల విరమణ జరుపుకున్నట్లు ధ్రువీకరించాయి. కాగా ఈ విర‌మ‌ణ త‌ర్వాత ప‌లు విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న మోడీ.. తాజాగా ఏర్పాటుచేసిన ఎమర్జెన్సీ మీటింగ్లో భారత్, పాకిస్తాన్ యుద్ధం పై మాట్లాడుతూ.. పాకిస్తాన్, భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిందని.. భారత్ చేసిన యుద్ధంలో అసలు పాకిస్తాన్ లేనేలేదని ఎదేవా చేశాడు. భారత్.. పాకిస్తాన్ ప్రతిదాడిని తిప్పి కొట్టిందని.. అలాగే పాక్ పై మ‌నం చేసిన దాడుల్లోనూ సక్సెస్ అందుకున్నామ‌ని చెప్పుకొచ్చాడు. మన దేశం పాక్‌పై గెలిచిందంటూ వివరించిన మోడీ.. ఆపరేషన్ సింధూర్ పై సంచలన డెసిషన్ను వెల్లడించాడు.


కాగా మోడీ తాజా నిర్ణ‌యం నెటింట‌ సంచలనగా మారింది. ఆపరేషన్ సింధూర్‌ లేదని ఆయన క్లారిటీ ఇచ్చాడు. కాల్పులు జరిపితే భారత్ కచ్చితంగా ప్రతిదాడి చేస్తుందంటూ వెల్లడించాడు. ఈ మేరకు త్రివిధ దళాలకు కూడా కీలక ఆదేశాలు జారీ చేసిన మోడీ.. కాశ్మీర్ విషయంలో మా విధానం ఎప్పటికీ మారదని పేర్కొన్నాడు. పాకిస్తాన్ POKను, టెర్రరిస్టులను భారత్‌కు అప్పగించాల్సిందేనని.. ఇది తప్ప ఆ దేశంతో మాట్లాడడానికి మరేదీ లేదంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో ఇతర దేశ జ్యాక్యాలు అవసరం లేదంటూ వివరించడం. ఈ క్రమంలోనే మోదీ అభిప్రాయాలను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు నెటిజ‌న్లు.