తెలుగు సినీ పరిశ్రమంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ మొదలైంది. వీరిద్దరూ కలిసి దాదాపు 15 సినిమాల వరకు మల్టీ స్టార్లర్లు నటించారు. అయినా.. ఎప్పుడు వీరి మధ్యన ఎలాంటి మనస్పర్ధలు లేవు. మిస్సమ్మ సినిమాలో కలిసి నటించిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఈ సినిమా నుంచి చివరి సినిమా వరకు కూడా ఒకరితో ఒకరు గౌరవంగా.. ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెలగడం నేర్చుకున్నారు. అయితే కే.వీ. రెడ్డి తీసిన శ్రీకృష్ణా అర్జునయుద్ధం సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడుగా.. ఏఎన్ఆర్ అర్జునుడిగా నటించడంతో అభిమానుల్లో కాస్త నిరాశ ఏదురైంది. అర్జునుడి పాత్ర కొంచెం సమయం మాత్రమే ఉందని.. పెద్ద సీన్ క్రియేట్ చేయడంతో.. అభిమానులను దృష్టిలో ఉంచుకొని ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 14 ఏళ్ల పాటు సినిమాలను కలిసి చేయకుండా మానేశారు. వీరి తర్వాత తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలను ఎక్కువగా తీసిన కాంబో సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు.
కృష్ణ కంటే శోభన్ బాబు నాలుగేళ్లు సీనియర్ కావడంతో.. కృష్ణ, శోభన్ బాబుకు ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తూ ఉండేవారు. ఇక వీళ్ళిద్దరి కాంబోలో మొట్టమొదట శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి మహాసంగ్రామం సినిమా వరకు దాదాపు 17 సినిమాలను కలిసి నటించారు. ఇక 1977 నుంచి కొంతకాలం వరకు వీరి కాంబోలో ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదు. ఈ క్రమంలో ఒకరికొకరు పోటీపడి హిట్ సినిమాల్లో నటించారు. వీరికంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలో నాలుగేళ్ల తర్వాత 1977లో కురుక్షేత్రం సినిమా కోసం మరోసారి కలిసి కనిపించారు. ఇందులో కృష్ణుడి వేషంలో శోభన్ బాబు.. అర్జునుడి వేషంలో కృష్ణ నటించాడు. మళ్లీ వీరి కాంబోలో సినిమాలు రిపీట్ అవ్వడం ప్రారంభమైంది. మరోవైపు వీరిద్దరిలో ఎవరి రోల్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అనే కోణంలో అభిమానుల మధ్యన డిస్కషన్లు మొదలయ్యాయి.
శోభన్ బాబు సీనియర్ కాబట్టి అతనికంటే తనకు తక్కువ ప్రాధాన్యత ఉన్న కృష్ణ ఎప్పుడు నిరాశ చెందేవారు కాదు. కానీ వారి సక్సెస్ఫుల్ కెరార్ మహాసంగ్రామంతో శుభం కార్డు పడింది. కారణం ఈ సినిమాలో శోభన్ బాబు ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అవ్వడమేనని తెలుస్తుంది. ఇందులో కృష్ణ క్యారెక్టర్ కంటే శోభన్ బాబు క్యారెక్టర్ను.. నడివి బాగా తగ్గించారు. దీంతో వీరిద్దరి హీరోలా అభిమానుల మధ్యన పెద్ద గొడవలు జరిగాయి. శోభన్ బాబు కూడా తనకు తక్కువ ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ ఇచ్చినందుకు పరుచూరి బ్రదర్శ్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారట. ఈ విషయాన్ని ఓ సందర్భంగా పరిచూరి గోపాలకృష్ణ స్వయంగా వెల్లడించాడు.
మహాసంగ్రామం లో శోభన్ బాబు మిలటరీ ఆఫీసర్ గా క్యారెక్టర్ లో ఉంటూనే.. కామెడీ కూడా కనిపించేలా ఆయన రోల్ ను డిజైన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఓ మిలిటరీ ఆఫీసర్ రిలీజ్కు ముందే సినిమాపై అభ్యంతరం చెప్పారు. ఈ కారణంగా సెన్సార్ లో శోభన్ బాబు క్యారెక్టర్లో కొన్ని సీన్లను కట్ చేయవలసి వచ్చింది. అది కావాలని జరిగిన పరిణామం కాదు.. అనివార్య కారణాలతో క్యారెక్టర్ నడివి కాస్త తగ్గించక తప్పలేదని పరిచూరి బ్రదర్స్ ఒక క్లారిటీ ఇచ్చిన.. శోభన్ బాబు ఫ్యాన్స్ లో మాత్రం కోపం చల్లారలేదు. సెన్సార్లో కట్ అయింది అనేది మొత్తం అబద్ధం.. కావాలనే మా హీరో క్యారెక్టర్ ను అలా తక్కువ చేసి చూపించారు అంటూ వార్ మొదలుపెట్టారు. మళ్లీ ఇలాంటి గొడవలు ఎప్పటికీ రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో అప్పటినుంచి కృష్ణ, శోభన్ బాబులు కలిసి సినిమాలో నటించడం మానేశారు.